ETV Bharat / state

TDP Nyayaniki Sankellu Program: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. ఈ రోజు రాత్రి టీడీపీ 'న్యాయానికి సంకెళ్లు'

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2023, 7:25 AM IST

Updated : Oct 15, 2023, 5:16 PM IST

TDP Nyayaniki Sankellu Program: తెలుగుదేశం పార్టీ మరో వినూత్న నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ 'న్యాయానికి సంకెళ్లు' పేరిట నిరసన చేపట్టాలని పిలుపునిచ్చిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా తెలిపారు. రాత్రి 7 గంటలకు 5 నిమిషాల పాటు చేతులకు తాడు, రిబ్బను కట్టుకొని నిరసన తెలపాలన్నారు.

TDP Nyayaniki Sankellu Program
TDP Nyayaniki Sankellu Program

TDP Nyayaniki Sankellu Program: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. ఆయనకు మద్దతు తెలుపుతూ ‘మోత మోగిద్దాం’, ‘కాంతితో క్రాంతి’ తరహాలోనే.. 'న్యాయానికి సంకెళ్లు’ పేరుతో టీడీపీ మరో వినూత్న నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు.. 5 కోట్ల మంది ఆంధ్రులు ఒక్కటిగా వైసీపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ.. చేతులకు తాళ్లు, రిబ్బన్లు, వస్త్రాలతో సంకెళ్లు వేసుకోవాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శనివారం ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు.

వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి సంకెళ్లను చూపించాలని కోరారు. న్యాయానికి ఇంకెన్నాళ్లు సంకెళ్లు అని నినదించాలని.. ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని లోకేశ్ పిలుపునిచ్చారు. నిరసన తెలిపిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయాలన్నారు. విదేశాల్లోని తెలుగువారు భారత కాలమానం ప్రకారం ఆ సమయంలో నిరసన తెలపాలని సూచించారు. ప్రజలకు మంచి చేసినందుకు చంద్రబాబుపై కక్షగట్టి జైల్లో వేశారని, ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా సరైన వైద్య సేవలు అందించకుండా ప్రాణాలకు హాని తలపెట్టాలనే కుట్రను ఈ కార్యక్రమం ద్వారా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

సంకెళ్లను ప్రపంచానికి చూపించాలి: కక్ష రాజకీయాలతో చేయని తప్పుకు జైలుకు పంపించబడ్డ చంద్రబాబు వెంట మనమంతా ఉన్నామని చెబుదామంటూ... చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టంచేశారు. ఈరోజు రాత్రి 7 గంటలకు మీ చేతులకు తాళ్లతోనో, రిబ్బన్లతోనో సంకెళ్లు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇళ్ల నుంచి వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి సంకెళ్లను ప్రపంచానికి చూపించాలని కోరారు. బాబు అరెస్ట్ ను ఖండిస్తూ. 'బాబుతోనే నేను' అంటూ ప్రకటించడంతో పాటు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నారు.

TDP Motha Mogiddam Program: చంద్రబాబుకు మద్దతుగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మోగిన మోత..

రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు అందించడమే నేరమా?: రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనేది చంద్రబాబు లక్ష్యమని.. నిబద్ధతకు కట్టుబడి ఉన్నందుకే చంద్రబాబును 37 రోజులుగా అక్రమంగా జైల్లో నిర్బంధించి వేధిస్తున్నారని నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. దేశవిదేశాల్లోని తెలుగువారు ఏకమై.. ‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమాన్ని నిర్వహించి చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని ట్విటర్‌ వేదికగా కోరారు.మన నేతతో మనమంతా ఉన్నామని ప్రపంచానికి గట్టిగా చాటుదామని.. రాత్రి 7 గం.కు చేతులకు నిరసన బ్యాండ్లు కట్టుకుందామని పిలుపునిచ్చారు.

Motha Mogiddham and Kanthi Tho Kranthi : చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా కొద్ది రోజుల క్రితం టీడీపీ చేపట్టిన 'మోత మోగిద్దాం', కాంతికో క్రాంతి కార్యక్రమాలలో ప్రజలంతా పాల్గొన్నారు. చంద్రబాబుకు తమ మద్దతు తెలిపారు. గంటలు కొడుతూ, విజిల్స్ వేస్తూ, డప్పులు, కంచాలు వాయిస్తూ, బూరలు ఊదుతూ మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా రూపాల్లో పెద్దఎత్తున శబ్దాలు చేస్తూ నిరసన తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో చీకటిని తరిమి కొట్టేందుకు రాష్ట్ర ప్రజలంతా విద్యుత్ లైట్లు ఆపేసి.. కొవ్వొత్తులు, దీపాలతో సంఘీభావం తెలిపారు. వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి టార్చి లైట్లు వెలిగించారు. రోడ్లపై వాహనం లైట్లు బ్లింక్ చేసి బాబుతో నేను అంటూ నినదించారు. తాజాగా మరో కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది.

TDP Leaders in Kanthi Tho Kranthi Program: చీకటిని తరిమికొట్టేందుకు.. కాగడాలు, కొవ్వొత్తుల వెలుగులతో గర్జించిన ప్రజాభిమానం

TDP Nyayaniki Sankellu Program: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. ఆయనకు మద్దతు తెలుపుతూ ‘మోత మోగిద్దాం’, ‘కాంతితో క్రాంతి’ తరహాలోనే.. 'న్యాయానికి సంకెళ్లు’ పేరుతో టీడీపీ మరో వినూత్న నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు.. 5 కోట్ల మంది ఆంధ్రులు ఒక్కటిగా వైసీపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ.. చేతులకు తాళ్లు, రిబ్బన్లు, వస్త్రాలతో సంకెళ్లు వేసుకోవాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శనివారం ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు.

వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి సంకెళ్లను చూపించాలని కోరారు. న్యాయానికి ఇంకెన్నాళ్లు సంకెళ్లు అని నినదించాలని.. ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని లోకేశ్ పిలుపునిచ్చారు. నిరసన తెలిపిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయాలన్నారు. విదేశాల్లోని తెలుగువారు భారత కాలమానం ప్రకారం ఆ సమయంలో నిరసన తెలపాలని సూచించారు. ప్రజలకు మంచి చేసినందుకు చంద్రబాబుపై కక్షగట్టి జైల్లో వేశారని, ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా సరైన వైద్య సేవలు అందించకుండా ప్రాణాలకు హాని తలపెట్టాలనే కుట్రను ఈ కార్యక్రమం ద్వారా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

సంకెళ్లను ప్రపంచానికి చూపించాలి: కక్ష రాజకీయాలతో చేయని తప్పుకు జైలుకు పంపించబడ్డ చంద్రబాబు వెంట మనమంతా ఉన్నామని చెబుదామంటూ... చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టంచేశారు. ఈరోజు రాత్రి 7 గంటలకు మీ చేతులకు తాళ్లతోనో, రిబ్బన్లతోనో సంకెళ్లు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇళ్ల నుంచి వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి సంకెళ్లను ప్రపంచానికి చూపించాలని కోరారు. బాబు అరెస్ట్ ను ఖండిస్తూ. 'బాబుతోనే నేను' అంటూ ప్రకటించడంతో పాటు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నారు.

TDP Motha Mogiddam Program: చంద్రబాబుకు మద్దతుగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మోగిన మోత..

రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు అందించడమే నేరమా?: రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనేది చంద్రబాబు లక్ష్యమని.. నిబద్ధతకు కట్టుబడి ఉన్నందుకే చంద్రబాబును 37 రోజులుగా అక్రమంగా జైల్లో నిర్బంధించి వేధిస్తున్నారని నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. దేశవిదేశాల్లోని తెలుగువారు ఏకమై.. ‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమాన్ని నిర్వహించి చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని ట్విటర్‌ వేదికగా కోరారు.మన నేతతో మనమంతా ఉన్నామని ప్రపంచానికి గట్టిగా చాటుదామని.. రాత్రి 7 గం.కు చేతులకు నిరసన బ్యాండ్లు కట్టుకుందామని పిలుపునిచ్చారు.

Motha Mogiddham and Kanthi Tho Kranthi : చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా కొద్ది రోజుల క్రితం టీడీపీ చేపట్టిన 'మోత మోగిద్దాం', కాంతికో క్రాంతి కార్యక్రమాలలో ప్రజలంతా పాల్గొన్నారు. చంద్రబాబుకు తమ మద్దతు తెలిపారు. గంటలు కొడుతూ, విజిల్స్ వేస్తూ, డప్పులు, కంచాలు వాయిస్తూ, బూరలు ఊదుతూ మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా రూపాల్లో పెద్దఎత్తున శబ్దాలు చేస్తూ నిరసన తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో చీకటిని తరిమి కొట్టేందుకు రాష్ట్ర ప్రజలంతా విద్యుత్ లైట్లు ఆపేసి.. కొవ్వొత్తులు, దీపాలతో సంఘీభావం తెలిపారు. వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి టార్చి లైట్లు వెలిగించారు. రోడ్లపై వాహనం లైట్లు బ్లింక్ చేసి బాబుతో నేను అంటూ నినదించారు. తాజాగా మరో కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది.

TDP Leaders in Kanthi Tho Kranthi Program: చీకటిని తరిమికొట్టేందుకు.. కాగడాలు, కొవ్వొత్తుల వెలుగులతో గర్జించిన ప్రజాభిమానం

Last Updated : Oct 15, 2023, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.