రేపటినుంచి రెండు రోజులపాటు గుంటూరులో స్వదేశీ జాగరణ్ మంచ్ రాష్ట్ర మహాసభలు, సేంద్రియ వ్యవసాయంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు. మంచ్ వ్యవస్థాపకులు దత్తోపంత్ శత జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. వేడుకలకు సంబంధించిన పోస్టర్ను ఆయన విడుదల చేశారు. శ్రీవెంకటేశ్వర విజ్ఞాన్ మందిరంలో జరిగే ఈ సమావేశాలకు యువత పెద్ద ఎత్తున హాజరవ్వాలని పిలుపునిచ్చారు. యువ రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించటానికి రైతు సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.
ఇదీచదవండి