ETV Bharat / state

వామ్మో... భానుడు ప్రతాపం పెంచేశాడు !

సూరీడు టాప్ గేర్ వేశాడు. పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాడు. కాసేపైనా...ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి. గుంటూరు జిల్లాలో మరీ దారుణం. వేసవి ఎండలు అధికంగా ఉండే ఇక్కడ ఈ ఏడాది తీవ్రత మరింత పెరిగింది. 40 నుంచి 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

author img

By

Published : Apr 29, 2019, 2:04 PM IST

వామ్మో...భానుడు ప్రతాపం పెంచేశాడు!
వామ్మో...భానుడు ప్రతాపం పెంచేశాడు!

గుంటూరులో మండుటెండలు ఠారెత్తిస్తున్నాయి. గుంటూరుతోపాటు నరసరావుపేట, గురజాల, వినుకొండ, దుర్గి, మాచర్ల, రెంటచింతల ప్రాంతాల్లో వారం రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే తీవ్రత పెరిగి... ప్రజలు బయటకు రావడానికే భయపడే పరిస్థితి నెలకొంది. ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం 4 గంటలు దాటాక బయటకు వస్తున్నారు.

ప్రయాణికులు ఎండలోనే..
కొందరు ప్రయాణికులు మండుటెండల్లోనూ ప్రయాణిస్తున్నారు. ఉద్యోగులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఆటోడ్రైవర్లు.. ఇలా అన్నివర్గాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. గుంటూరులో చాలా ప్రదేశాల్లో చెట్లు లేక ఎండలోనే ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మే మాసంలో ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.

సర్వజనాస్పత్రి..!
వేసవి దాహార్తి దృష్ట్యా నగరపాలక సంస్థ గుంటూరులో 54 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మజ్జిగ కేంద్రాలూ ఏర్పాటు చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు సైతం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో 10 లక్షల వరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీకి సిద్ధమయ్యారు. వేసవిలో తాగునీటి పైపులు లీకేజయ్యే ప్రమాదముంది. గత వేసవిలో కలుషిత నీటితో గుంటూరులో 20 మంది వరకు మృతి చెందారు. తక్షణం చికిత్స అందించేందుకు వీలుగా గుంటూరు సర్వజనాస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.
ఎండ తీవ్రత దృష్ట్యా పగటిపూట బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ రాకుండా తాగునీటిని వెంట తీసుకువెళ్లడం మంచిదని చెబుతున్నారు.

వామ్మో...భానుడు ప్రతాపం పెంచేశాడు!

గుంటూరులో మండుటెండలు ఠారెత్తిస్తున్నాయి. గుంటూరుతోపాటు నరసరావుపేట, గురజాల, వినుకొండ, దుర్గి, మాచర్ల, రెంటచింతల ప్రాంతాల్లో వారం రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే తీవ్రత పెరిగి... ప్రజలు బయటకు రావడానికే భయపడే పరిస్థితి నెలకొంది. ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం 4 గంటలు దాటాక బయటకు వస్తున్నారు.

ప్రయాణికులు ఎండలోనే..
కొందరు ప్రయాణికులు మండుటెండల్లోనూ ప్రయాణిస్తున్నారు. ఉద్యోగులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఆటోడ్రైవర్లు.. ఇలా అన్నివర్గాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. గుంటూరులో చాలా ప్రదేశాల్లో చెట్లు లేక ఎండలోనే ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మే మాసంలో ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.

సర్వజనాస్పత్రి..!
వేసవి దాహార్తి దృష్ట్యా నగరపాలక సంస్థ గుంటూరులో 54 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మజ్జిగ కేంద్రాలూ ఏర్పాటు చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు సైతం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో 10 లక్షల వరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీకి సిద్ధమయ్యారు. వేసవిలో తాగునీటి పైపులు లీకేజయ్యే ప్రమాదముంది. గత వేసవిలో కలుషిత నీటితో గుంటూరులో 20 మంది వరకు మృతి చెందారు. తక్షణం చికిత్స అందించేందుకు వీలుగా గుంటూరు సర్వజనాస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.
ఎండ తీవ్రత దృష్ట్యా పగటిపూట బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ రాకుండా తాగునీటిని వెంట తీసుకువెళ్లడం మంచిదని చెబుతున్నారు.

Visakhapatnam (AP), Apr 29 (ANI): Cyclone Fani, which is brewing over southeast Bay of Bengal and the adjoining East Equatorial Indian Ocean, is very likely to intensify into an "extremely severe cyclonic storm" with wind speed reaching up to 200 kmph. The possibility of the cyclonic storm wreaking havoc in Andhra Pradesh is giving people tense moments as it is predicted by the India Meteorological Department (IMD) to intensify into a very severe cyclonic storm by April 29. Distant warning signal No. 2 has been hoisted at Visakhapatnam, Machilipatnam, Nizamapatnam and Krishnapatnam, Kakinada and Gangavaram ports.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.