ETV Bharat / state

పొన్నూరులో అకాల వర్షం.. పిడుగుపాటుకు గడ్డివాము దగ్ధం - sudden rains news in guntur district

అకాల వర్షం గుంటూరు జిల్లా రైతులను ఇబ్బందుల్లోకి నెట్టింది. పొన్నూరులో మొక్కజొన్న, మిర్చి పంటలు తడిసిపోయాయి. ఓ వైపు లాక్​డౌన్, మరో వైపు వర్షం తమను నష్టాల పాలు చేశాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.​

పొన్నూరులో అకాల వర్షం.. పిడుగుపాటుకు గడ్డివాము దగ్ధం
పొన్నూరులో అకాల వర్షం.. పిడుగుపాటుకు గడ్డివాము దగ్ధం
author img

By

Published : Apr 9, 2020, 3:05 PM IST

గుంటూరు జిల్లా పొన్నూరులో అకాల వర్షంతో మిర్చి, మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొండముది గ్రామంలో పిడుగు పడి రెండెకరాల గడ్డివాము దగ్ధమైంది. ఇప్పటికే చేబ్రోలు మండలం గుండవరం, గొడవర్రు, చేకూరు, సెలపాడు, శుద్ధపల్లి గ్రామాలతో పాటుగా పెదకాకాని మండలంలోని పలు గ్రామాల్లో మిర్చి పంట కోసి ఆరబోశారు. కరోనా వైరస్ కారణంగా చేతికి వచ్చిన పంటను అమ్ముకునేందుకు అవకాశం లేక పొలాల్లోనే ఉంచారు. మొక్కజొన్న కోతకు వచ్చినా.. కూలీలు దొరక్క అవస్థ పడుతున్నారు. ఇలాంటి సమయంలో కురిసిన అకాల వర్షం అన్నదాతలకు కన్నీరు తెప్పిస్తోంది. పంటలపై తాత్కాలికంగా పరదాలు కప్పి వర్షం నుంచి కాపాడుకుంటున్నారు.

ఇదీ చూడండి:

గుంటూరు జిల్లా పొన్నూరులో అకాల వర్షంతో మిర్చి, మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొండముది గ్రామంలో పిడుగు పడి రెండెకరాల గడ్డివాము దగ్ధమైంది. ఇప్పటికే చేబ్రోలు మండలం గుండవరం, గొడవర్రు, చేకూరు, సెలపాడు, శుద్ధపల్లి గ్రామాలతో పాటుగా పెదకాకాని మండలంలోని పలు గ్రామాల్లో మిర్చి పంట కోసి ఆరబోశారు. కరోనా వైరస్ కారణంగా చేతికి వచ్చిన పంటను అమ్ముకునేందుకు అవకాశం లేక పొలాల్లోనే ఉంచారు. మొక్కజొన్న కోతకు వచ్చినా.. కూలీలు దొరక్క అవస్థ పడుతున్నారు. ఇలాంటి సమయంలో కురిసిన అకాల వర్షం అన్నదాతలకు కన్నీరు తెప్పిస్తోంది. పంటలపై తాత్కాలికంగా పరదాలు కప్పి వర్షం నుంచి కాపాడుకుంటున్నారు.

ఇదీ చూడండి:

'గ్రామీణ ప్రాంతాల్లో కరోనా అదుపులోనే ఉంది'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.