ETV Bharat / state

పెరుగుతున్న కరోనా కేసులు... మరో కొవిడ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదన

author img

By

Published : Mar 23, 2021, 8:58 AM IST

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని శాఖల ఉన్నతాధికారులతో గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్ అశోక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మరో కొవిడ్ సెంటర్​ను ఏర్పాటు చేయాలని కలెక్టర్​కు ప్రతిపాదన పంపామన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్​కు అవకాశం లేదని.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలోచిస్తామని ఆయన వెల్లడించారు.

sub collector ashok review meeting on corona cases
పెరుగుతున్న కరోనా కేసులు... మరో కొవిడ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదన

గుంటూరు జిల్లా తెనాలిలో రోజూ దాదాపు ముప్పై నుంచి నలభై కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో కొవిడ్ సెంటర్​ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కలెక్టర్​కు నివేదించినట్లు సబ్ కలెక్టర్ మయూరి అశోక్ పేర్కొన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. కరోనా మహమ్మారిపై ప్రజలకు మరోసారి అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా కూరగాయల మార్కెట్, రైల్వే స్టేషన్, బస్టాండ్ వంటి ప్రదేశాలలో కొవిడ్ పరీక్షలు ఎక్కువగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు, చిత్తూరు జిల్లాలో అధికంగా కేసులు నమోదు అవుతున్నాయని అశోక్ తెలిపారు. ప్రస్తుతం లాక్ డౌన్​కు అవకాశం లేదని.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలోచిస్తామని ఆయన వెల్లడించారు. కొవిడ్ బాధితులకు పెట్టే భోజనం నాణ్యతపై తనకు ఫిర్యాదు వచ్చిందని.. రెండు రోజులలో నాణ్యతపై మార్పు రాకపోతే ఆ కాంట్రాక్టర్​ని తొలగించి మరో కాంట్రాక్టర్లకు బాధ్యత అప్పగిస్తామన్నారు.

గుంటూరు జిల్లా తెనాలిలో రోజూ దాదాపు ముప్పై నుంచి నలభై కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో కొవిడ్ సెంటర్​ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కలెక్టర్​కు నివేదించినట్లు సబ్ కలెక్టర్ మయూరి అశోక్ పేర్కొన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. కరోనా మహమ్మారిపై ప్రజలకు మరోసారి అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా కూరగాయల మార్కెట్, రైల్వే స్టేషన్, బస్టాండ్ వంటి ప్రదేశాలలో కొవిడ్ పరీక్షలు ఎక్కువగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు, చిత్తూరు జిల్లాలో అధికంగా కేసులు నమోదు అవుతున్నాయని అశోక్ తెలిపారు. ప్రస్తుతం లాక్ డౌన్​కు అవకాశం లేదని.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలోచిస్తామని ఆయన వెల్లడించారు. కొవిడ్ బాధితులకు పెట్టే భోజనం నాణ్యతపై తనకు ఫిర్యాదు వచ్చిందని.. రెండు రోజులలో నాణ్యతపై మార్పు రాకపోతే ఆ కాంట్రాక్టర్​ని తొలగించి మరో కాంట్రాక్టర్లకు బాధ్యత అప్పగిస్తామన్నారు.

ఇదీ చదవండి: రైతులను ఆదుకోవాలని కలెక్టర్​కు తెదేపా నేతల వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.