ETV Bharat / state

చికిత్స పొందుతూ మహిళా ఎస్సై మృతి - చుండూరు మహిళా ఎస్సై మృతి

మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన చుండూరు ఎస్సై శ్రావణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె ఆత్మహత్యకు ఓ పోలీసు ఉన్నతాధికారి వేధింపులే కారణమని తెలుస్తోంది.

si died in gunur
si died in gunur
author img

By

Published : May 12, 2021, 11:43 AM IST

గుంటూరు జిల్లా చుండూరు ఎస్సై శ్రావ‌ణి చికిత్స పొందుతూ మృతిచెందారు. మూడు రోజుల కింద‌ట ఈమె పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యకు యత్నించారు. శ్రావ‌ణి స్వగ్రామం ప్ర‌కాశం జిల్లా కందుకూరు. చుండూరులో విధులు నిర్వ‌ర్తించే ఈమె ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ ఉద‌యం క‌న్నుమూశారు. శ్రావణి మృతికి ఓ పోలీసు అధికారి వేధింపులే కారణమని తెలుస్తోంది. 2018 బ్యాచ్​కు చెందిన ఆమె నరసరావుపేటలో దిశ పోలీసు స్టేషన్​లో మొదటి పోస్టింగ్​గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం చుండూరు పోలీసు స్టేషన్లలో 7నెలల నుంచి విధులు నిర్వహిస్తున్నారు.

గుంటూరు జిల్లా చుండూరు ఎస్సై శ్రావ‌ణి చికిత్స పొందుతూ మృతిచెందారు. మూడు రోజుల కింద‌ట ఈమె పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యకు యత్నించారు. శ్రావ‌ణి స్వగ్రామం ప్ర‌కాశం జిల్లా కందుకూరు. చుండూరులో విధులు నిర్వ‌ర్తించే ఈమె ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ ఉద‌యం క‌న్నుమూశారు. శ్రావణి మృతికి ఓ పోలీసు అధికారి వేధింపులే కారణమని తెలుస్తోంది. 2018 బ్యాచ్​కు చెందిన ఆమె నరసరావుపేటలో దిశ పోలీసు స్టేషన్​లో మొదటి పోస్టింగ్​గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం చుండూరు పోలీసు స్టేషన్లలో 7నెలల నుంచి విధులు నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి: దొంగనోట్లు స్వాధీనం.. ఇద్దరి ఆరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.