గుంటూరు జిల్లా చుండూరు ఎస్సై శ్రావణి చికిత్స పొందుతూ మృతిచెందారు. మూడు రోజుల కిందట ఈమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. శ్రావణి స్వగ్రామం ప్రకాశం జిల్లా కందుకూరు. చుండూరులో విధులు నిర్వర్తించే ఈమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. శ్రావణి మృతికి ఓ పోలీసు అధికారి వేధింపులే కారణమని తెలుస్తోంది. 2018 బ్యాచ్కు చెందిన ఆమె నరసరావుపేటలో దిశ పోలీసు స్టేషన్లో మొదటి పోస్టింగ్గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం చుండూరు పోలీసు స్టేషన్లలో 7నెలల నుంచి విధులు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: దొంగనోట్లు స్వాధీనం.. ఇద్దరి ఆరెస్ట్