ETV Bharat / state

సత్తెనపల్లి ఘటన దురదృష్టకరం: చంద్రబాబు

author img

By

Published : Apr 20, 2020, 2:00 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు.

Sattenapalli incident is unfortunate says chandrababu
చంద్రబాబు

సత్తెనపల్లి ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. యువకుడిపై దాడిని ఖండించారు. పోలీసులు సంయమనం పాటించాలని కోరారు. మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు, ప్రజల మధ్య పరస్పర సమన్వయం ఉండాలని ఆకాంక్షించారు. పోలీసులు దురుసుగా వ్యవహరించరాదన్న చంద్రబాబు... ప్రజలు వారికి సహకరించాలని కోరారు. విపత్కర సమయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పరస్పర సహకారం, సమన్వయం, సోదరభావం ముఖ్యమన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు.

సత్తెనపల్లి ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. యువకుడిపై దాడిని ఖండించారు. పోలీసులు సంయమనం పాటించాలని కోరారు. మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు, ప్రజల మధ్య పరస్పర సమన్వయం ఉండాలని ఆకాంక్షించారు. పోలీసులు దురుసుగా వ్యవహరించరాదన్న చంద్రబాబు... ప్రజలు వారికి సహకరించాలని కోరారు. విపత్కర సమయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పరస్పర సహకారం, సమన్వయం, సోదరభావం ముఖ్యమన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ... లాక్​డౌన్: లాఠీ దెబ్బలకు వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.