ETV Bharat / state

రాయపాటిపై కన్నా పరువు నష్టం దావా.. 12 ఏళ్ల తర్వాత కోర్టులో రాజీ

Reconciliation between Rayapati and Kanna: రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణల వివాదంపై ఈరోజు న్యాయస్థానం విచారణ జరిపింది. ఇద్దరు నేతలు రాజీకి వచ్చినట్లు న్యాయమూర్తి ఎదుట తెలిపారు. దీంతో 12 ఏళ్ల క్రితం నమోదైన కేసు పరిష్కారమైంది.

author img

By

Published : Nov 1, 2022, 7:06 PM IST

కోర్టు కేసు
court case

Reconciliation between Rayapati and Kanna: గుంటూరుకు చెందిన సీనియర్ నేతలు రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణల వివాదంపై కోర్టులో విచారణ జరిగింది. 2010లో రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై కన్నా లక్ష్మీనారాయణ పరువు నష్టం దావా వేశారు. దీనిపై ఈ రోజు విచారణలో భాగంగా తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు కోర్టులో రాయపాటి, కన్నాలు తెలిపారు. న్యాయమూర్తి సమక్షంలో రాయపాటి, కన్నా రాజీకి వచ్చామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని.. కోర్టు వారి మధ్య సయోధ్య కుదిర్చినట్లుగా వారి తరపు న్యాయవాదులు తెలిపారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇద్దరి నేతల మధ్య సఖ్యత కుదిరింది.

Reconciliation between Rayapati and Kanna: గుంటూరుకు చెందిన సీనియర్ నేతలు రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణల వివాదంపై కోర్టులో విచారణ జరిగింది. 2010లో రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై కన్నా లక్ష్మీనారాయణ పరువు నష్టం దావా వేశారు. దీనిపై ఈ రోజు విచారణలో భాగంగా తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు కోర్టులో రాయపాటి, కన్నాలు తెలిపారు. న్యాయమూర్తి సమక్షంలో రాయపాటి, కన్నా రాజీకి వచ్చామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని.. కోర్టు వారి మధ్య సయోధ్య కుదిర్చినట్లుగా వారి తరపు న్యాయవాదులు తెలిపారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇద్దరి నేతల మధ్య సఖ్యత కుదిరింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.