ETV Bharat / state

పులిచింతలకు కొనసాగుతున్న వరద

పులిచింతల జలాశయానికి కృష్ణమ్మ వరద కొనసాగుతోంది. ఇప్పటికే  ప్రాజెక్టు నిండుకుండలా మారింది.

author img

By

Published : Aug 14, 2019, 11:18 PM IST

పులిచింతల
పులిచింతలకు కొనసాగుతున్న వరద

కృష్ణమ్మ వరదతో పులిచింతల గరిష్ట సామర్థ్యానికి చేరువైంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ఇప్పటివరకు 36.9 టీఎంసీ నిల్వ ఉంది. నాగార్జునసాగర్ నుంచి 5 లక్షల 49 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. మొత్తం 11 గేట్లు తెరిచి సుమారు 3 లక్షల 69వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీకి వదులుతున్నారు. కృష్ణమ్మ వరదతో పులిచింతలకు రికార్డుస్థాయిలో నీరు చేరుతోంది. ప్రాజెక్టు పరిధిలోని బోధనం, కొల్లూరు, పులిచింతల, కేతవరం, చిట్యాల గ్రామాలు ముంపులో ఉన్నాయి. ఆయా గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. ఎమ్మోజిగూడెంలోకి నీరు రాగా... స్థానికులను అక్కడి నుంచి తరలించారు. మాచవరం మండలంలోని గోవిందాపురం, వెల్లంపల్లి, రేగులగడ్డ గ్రామాలకు వరద ముప్పు ఉంది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు అందాలను చూసేందుకు కృష్ణ, గుంటూరు.. తెలంగాణలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

పులిచింతలకు కొనసాగుతున్న వరద

కృష్ణమ్మ వరదతో పులిచింతల గరిష్ట సామర్థ్యానికి చేరువైంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ఇప్పటివరకు 36.9 టీఎంసీ నిల్వ ఉంది. నాగార్జునసాగర్ నుంచి 5 లక్షల 49 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. మొత్తం 11 గేట్లు తెరిచి సుమారు 3 లక్షల 69వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీకి వదులుతున్నారు. కృష్ణమ్మ వరదతో పులిచింతలకు రికార్డుస్థాయిలో నీరు చేరుతోంది. ప్రాజెక్టు పరిధిలోని బోధనం, కొల్లూరు, పులిచింతల, కేతవరం, చిట్యాల గ్రామాలు ముంపులో ఉన్నాయి. ఆయా గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. ఎమ్మోజిగూడెంలోకి నీరు రాగా... స్థానికులను అక్కడి నుంచి తరలించారు. మాచవరం మండలంలోని గోవిందాపురం, వెల్లంపల్లి, రేగులగడ్డ గ్రామాలకు వరద ముప్పు ఉంది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు అందాలను చూసేందుకు కృష్ణ, గుంటూరు.. తెలంగాణలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

ఇది కూడా చదవండి

శ్రీశైలానికి భారీగా కొనసాగుతున్న వరద

Intro:గూడూరు పట్టణ సమీపంలోని మదర్ సా పాఠశాల ల్లో గోవదను అడ్డుకున్న సమరతా సేవా సంస్థ సంయుక్త కార్యదర్శి కోట సునీల్ కుమార్, ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు. శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పరిధి లోని పోటుపాళెం రోడ్డు లో ఉన్న మదర్ సా పాఠశాల ల్లో గోవులను చంపి మార్కెట్ లాగా మారుస్తున్నారంటూ సమరతా సేవ సంస్థ సంయుక్త కార్యదర్శి డా.కోట సునీల్ కుమార్ అడ్డుకుని ఆందోళనచేపట్టారు.విద్యాబుద్ధులు నేర్పించకుండా గోవులను చంపి లోపల లోపల దాచి పెట్టడం అక్కడ నుంచి బయటకు తరలిస్తున్నారని పోలీస్ లకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
బైట్: డా.కోట సునీల్ కుమార్, సమరతా సేవా సంస్థ సంయుక్త కార్యదర్శి దర్శి.Body:1Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.