గుంటూరు జిల్లా నిజాంపట్నం మండల తీర ప్రాంతంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో మునిరేడు గ్రామ శివారుల్లో పేకాట ఆడుతున్న ఓ స్థావరంపై బాపట్ల డీఎస్పీ ఆధ్వర్యంలో నిజాంపట్నం పోలీసులు దాడి చేశారు. 15 మంది పేకాట రాయుళ్లని అదుపులోకి తీసుకుని..వారి వద్ద నుంచి లక్షా 26 వేల 600 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు.
ఇదీ చదవండి