పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా, తెదేపా వర్గాల మధ్య చిలకలూరిపేట మండలంలోని యడవల్లి గ్రామంలో ఘర్షణ చేలరేగింది. పోలింగ్ బూత్ వద్ద ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకున్నారు.
ముందుగా.. సమస్యాత్మక గ్రామంగా గుర్తించిన యడవల్లిలో అధికారులు గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఎవరైనా ఓటు హక్కుకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించబోమని అన్నారు. ఇరు వర్గాలపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్సై భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: