గుంటూరు నగరంలోని రెడ్జోన్లుగా ప్రకటించిన కొన్ని ప్రాంతాల్లో నిత్యావసరాలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సంచార విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోతోంది. ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా నగరంలో 10 చోట్ల కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. రెడ్జోన్లలో ఉండే వారికి నిత్యావసర వస్తువులు అందజేసే బాధ్యతను వీరికి అప్పగించారు. అయితే కొన్ని వీధుల్లో ఉన్న వారికే సరుకులు, కూరగాయలు అందుతున్నాయని.. తమకు అందడం లేదని కొందరు కాలనీ వాసులు వాపోయారు. కొన్ని చోట్ల వీటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి...