ETV Bharat / state

విజ‌యం సాధించే వ‌ర‌కు పోరాడుతా: పవన్

తాను ఓట‌మిని అంగీక‌రించేవాడిని కాదని... విజ‌యం సాధించే వ‌ర‌కు పోరాడుతాన‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పేర్కొన్నారు. విశాఖ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించారు.

author img

By

Published : Jun 9, 2019, 5:46 AM IST

పవన్ కళ్యాణ్

ఒక్క ఓట‌మి జ‌న‌సైనికులను ఆప‌లేద‌ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఓట‌మిని అంగీక‌రించేవాడిని కాదని... విజ‌యం సాధించే వ‌ర‌కు పోరాడుతాన‌ని స్ప‌ష్టం చేశారు. శ‌నివారం గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో విశాఖ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించారు. తన జీవితం రాజ‌కీయాల‌కు అంకితమని... చివరి శ్వాస వరకు జ‌న‌సేన‌ను మోస్తానని చెప్పారు.

25 సంవ‌త్స‌రాల ల‌క్ష్యంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చానన్న పవన్... ఓడితే త‌ట్టుకోగ‌ల‌నా... లేదా అని ప‌రీక్షించుకున్న త‌ర్వాతే పార్టీ స్థాపించానని స్పష్టం చేశారు. తనను శాసనసభలో అడుగుపెట్టనీయకూడదనే ఉద్దేశంతో... భీమ‌వ‌రంలో ఓడించ‌డానికి రూ.150 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన పోటీ ఇవ్వాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. పంచాయతీ, జడ్పీ, మునిసిపల్ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చే అభ్యర్థులను నిలుపుతామని స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్

ఒక్క ఓట‌మి జ‌న‌సైనికులను ఆప‌లేద‌ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఓట‌మిని అంగీక‌రించేవాడిని కాదని... విజ‌యం సాధించే వ‌ర‌కు పోరాడుతాన‌ని స్ప‌ష్టం చేశారు. శ‌నివారం గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో విశాఖ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించారు. తన జీవితం రాజ‌కీయాల‌కు అంకితమని... చివరి శ్వాస వరకు జ‌న‌సేన‌ను మోస్తానని చెప్పారు.

25 సంవ‌త్స‌రాల ల‌క్ష్యంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చానన్న పవన్... ఓడితే త‌ట్టుకోగ‌ల‌నా... లేదా అని ప‌రీక్షించుకున్న త‌ర్వాతే పార్టీ స్థాపించానని స్పష్టం చేశారు. తనను శాసనసభలో అడుగుపెట్టనీయకూడదనే ఉద్దేశంతో... భీమ‌వ‌రంలో ఓడించ‌డానికి రూ.150 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన పోటీ ఇవ్వాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. పంచాయతీ, జడ్పీ, మునిసిపల్ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చే అభ్యర్థులను నిలుపుతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ...

10 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్న నైరుతి

Intro:Ap_cdp_46_08_aits_Graduation day_Av_c7
మన జీవితంలో ఎదురయ్యే అపజయాలకు భయపడితే భవిష్యత్తులో ముందుకు వెళ్లలేమని తాడేపల్లిగూడెం ఎన్.ఐ.టి డైరెక్టర్ సూర్యప్రకాశరావు తెలిపారు. కడప జిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీటెక్, ఎంటెక్, ఎంబీఏలో పట్టభద్రులైన విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పుడైతే బద్ధకంగా ఉంటారో అది వారికి శత్రువుతో సమానమని ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. కళాశాలలో అడుగుపెట్టినప్పటి నుంచి విద్యార్థులు చురుగ్గా వ్యవహరించాలని, ప్రతి విషయాన్ని తీసుకోవాలనే తపన ఉండాలన్నారు. భయానికి ఎదురొడ్డి ఇస్తే విజయం సిద్ధిస్తుందని చెప్పారు అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని, ఉద్యోగం సాధించాలనే ఆశయంతో వివిధ కంపెనీలను తీసుకొచ్చి ప్రాంగణ ఎంపికలు నిర్వహించినట్లు చెప్పారు. తద్వారా వందలాది మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందారని చెప్పారు. ఏఐటిఎస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ఎంవి నారాయణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇ నాయకత్వ లక్షణాలు అలవరచుకోవాలని తెలిపారు.


Body:అపజయాలను ధైర్యంగా ఎదుర్కొంటే విజయం మీదే


Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.