ETV Bharat / state

తెరుచుకున్న మద్యం దుకాణాలు

కరోనా ప్రభావంతో దాదాపు 40 రోజుల క్రితం మూసిన ప్రభుత్వ మద్యం దుకాణాలు.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా తెరుచుకున్నాయి. గ్రీన్ జోన్ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ప్రత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో దుకాణాలను ఆబ్కారీ శాఖ అధికారులు తెరిపించారు.

author img

By

Published : May 4, 2020, 11:59 AM IST

guntur district
తెరుచుకున్న మద్యం దుకాణాలు..

గుంటూరు జిల్లాలోని గ్రీన్ జోన్ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ప్రత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో దుకాణాలను ఆబ్కారీ శాఖ అధికారులు తెరిపించారు. దుకాణాల్లోని నిల్వలు పరిశీలించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అమ్మకాలు జరిపేందుకు అనుమతిచ్చారు.

దుకాణం వద్ద అయిదుగురికి మించి ఉండకూడదనే నిబంధనలు అమలు చేస్తున్నారు. ఒక్కొక్కరి మధ్య ఆరు అడుగుల దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ముఖానికి రూమాలు కట్టుకోవాలని, లేదంటే మాస్కులు ధరించాలని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.

గుంటూరు జిల్లాలోని గ్రీన్ జోన్ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ప్రత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో దుకాణాలను ఆబ్కారీ శాఖ అధికారులు తెరిపించారు. దుకాణాల్లోని నిల్వలు పరిశీలించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అమ్మకాలు జరిపేందుకు అనుమతిచ్చారు.

దుకాణం వద్ద అయిదుగురికి మించి ఉండకూడదనే నిబంధనలు అమలు చేస్తున్నారు. ఒక్కొక్కరి మధ్య ఆరు అడుగుల దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ముఖానికి రూమాలు కట్టుకోవాలని, లేదంటే మాస్కులు ధరించాలని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

'మద్యం తయారీ సంస్థల ఒత్తిడి మేరకే ధరలు పెంపు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.