ETV Bharat / state

పేరేచర్లలో ఉరి వేసుకుని వృద్ధురాలి ఆత్మహత్య - పేరేచర్లలో వృద్ధురాలి ఆత్మహత్య వార్తలు

కట్టుకున్న భర్త కాలంచేశాడు. ఒంటరితనం.. ఆపై అనారోగ్యం.. వీటిని ఆ వృద్ధురాలు భరించలేకపోయింది. దీనికన్నా మరణించడం ఉత్తమం అనుకుంది. అంతే ఉరేసుకుని ఊపిరి తీసుకుంది. ఈ హృదయవిదారక ఘటన గుంటూరు జిల్లా పేరేచర్లలో జరిగింది.

old woman suicide in perecharla guntur district
వృద్ధురాలి ఆత్మహత్య
author img

By

Published : Jul 27, 2020, 11:01 PM IST

గుంటూరు జిల్లా మేడికొండ్రు మండలం పేరేచర్లకు చెందిన విజయలక్ష్మి భర్త కొన్నాళ్ల క్రితం మరణించారు. అప్పటినుంచి ఆమె మానసికంగా బాధపడుతోంది. దీనికి అనారోగ్యం తోడైంది. గ్రామంలోనే కుమార్తె వద్ద ఉంటోంది. ఆదివారం రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత తానున్న గదిలో ఉరేసుకుని మృతి చెందింది. తెల్లవారాక ఎంతసేపటికీ బయటకు రాకపోవటంతో ఆమె కుమార్తె వెళ్లి చూడగా అప్పటికే మరణించింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి..

గుంటూరు జిల్లా మేడికొండ్రు మండలం పేరేచర్లకు చెందిన విజయలక్ష్మి భర్త కొన్నాళ్ల క్రితం మరణించారు. అప్పటినుంచి ఆమె మానసికంగా బాధపడుతోంది. దీనికి అనారోగ్యం తోడైంది. గ్రామంలోనే కుమార్తె వద్ద ఉంటోంది. ఆదివారం రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత తానున్న గదిలో ఉరేసుకుని మృతి చెందింది. తెల్లవారాక ఎంతసేపటికీ బయటకు రాకపోవటంతో ఆమె కుమార్తె వెళ్లి చూడగా అప్పటికే మరణించింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి..

గంజాయి కేసులో తొమ్మిది మంది ఇంజనీరింగ్ విద్యార్ధులు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.