ETV Bharat / state

అచ్చెన్నాయుడి కేసులో అర్ధరాత్రి హైడ్రామా

మాజీ మంత్రి అచ్చెన్నాయుడి కేసులో అర్ధరాత్రి హైడ్రామా జరిగింది. 3 రోజుల అనిశా కస్టడీలో భాగంగా ఆస్పత్రిలోనే అచ్చెన్నను ప్రశ్నించాలని కోర్టు ఆదేశాలివ్వగా.. అర్ధరాత్రి ఆయన్ను డిశ్ఛార్జికి యత్నించడం వివాదం రేపింది. తాము గట్టిగా నిలదీయటంతో అధికారులు వెనక్కి తగ్గినట్లు అచ్చెన్నాయుడి న్యాయవాది తెలిపారు.

author img

By

Published : Jun 25, 2020, 4:53 AM IST

atchannaidu
atchannaidu

ఈఎస్​ఐ మందుల కొనుగోలు కేసులో అరెస్టై అనారోగ్యంతో గుంటూరు జనరల్ ఆస్పత్రిలో చికిత‌్స పొందుతున్నమాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అర్ధరాత్రి డిశ్చార్జి‌ చేసేందుకు యత్నించండం వివాదాస్పదమైంది. అచ్చెన్నను నేటి నుంచి ఈ నెల 27వరకూ అవినీతి నిరోధక శాఖ కస్టడీకి ఇస్తూ విజయవాడ న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఆస్పత్రికే వెళ్లి ప్రభుత్వ వైద్యుడు, న్యాయవాది సమక్షంలోనే వివరాలు సేకరించాలని అనిశాకు నిర్దేశించింది. అనారోగ్య కారణాలరీత్యా విచారణ సమయంలో అచ్చెన్నాయుడు మంచం మీదే ఉండి సమాధానాలివ్వొచ్చని, ఆయన్ను కూర్చోమని గాని, నిలుచోమనిగాని అడిగి ఇబ్బంది పెట్టొద్దని కోర్టు స్పష్టం చేసింది. అచ్చెన్నను డిశ్చార్జి చేసేందుకు మరో మూడు నాలుగు రోజులు పడుతుందని గుంటూరు జనరల్‌ ఆస్పత్రి వైద్యులు సమర్పించిన నివేదికను పరిశీలించిన తర్వాతే కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

అయితే ఆస్పత్రి వర్గాలు రాత్రి అనూహ్యంగా అచ్చెన్నను డిశ్చార్జ్ చేసేందుకు యత్నించారని ఆయన న్యాయవాది హరిబాబు ఆరోపించారు. దీని వెనుక ప్రభుత్వ ఒత్తిడి ఉండొచ్చంటూ ఆస్పత్రి వద్దకు వెళ్లారు. విషయం మీడియాకు ఎక్కటంతో ఆర్​ఎంవో హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. డిశ్ఛార్జి రద్దైందని న్యాయవాదికి నచ్చజెప్పారు.

నేడు డిశ్ఛార్జి?

మరోవైపు అచ్చెన్నాయుడుని ఇవాళ మధ్యాహ్నం డిశ్ఛార్జి చేయనున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి, ఇతర పోలీస్‌ అధికారులు గత రాత్రి అస్పత్రిని సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈఎస్​ఐ మందుల కొనుగోలు కేసులో అరెస్టై అనారోగ్యంతో గుంటూరు జనరల్ ఆస్పత్రిలో చికిత‌్స పొందుతున్నమాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అర్ధరాత్రి డిశ్చార్జి‌ చేసేందుకు యత్నించండం వివాదాస్పదమైంది. అచ్చెన్నను నేటి నుంచి ఈ నెల 27వరకూ అవినీతి నిరోధక శాఖ కస్టడీకి ఇస్తూ విజయవాడ న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఆస్పత్రికే వెళ్లి ప్రభుత్వ వైద్యుడు, న్యాయవాది సమక్షంలోనే వివరాలు సేకరించాలని అనిశాకు నిర్దేశించింది. అనారోగ్య కారణాలరీత్యా విచారణ సమయంలో అచ్చెన్నాయుడు మంచం మీదే ఉండి సమాధానాలివ్వొచ్చని, ఆయన్ను కూర్చోమని గాని, నిలుచోమనిగాని అడిగి ఇబ్బంది పెట్టొద్దని కోర్టు స్పష్టం చేసింది. అచ్చెన్నను డిశ్చార్జి చేసేందుకు మరో మూడు నాలుగు రోజులు పడుతుందని గుంటూరు జనరల్‌ ఆస్పత్రి వైద్యులు సమర్పించిన నివేదికను పరిశీలించిన తర్వాతే కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

అయితే ఆస్పత్రి వర్గాలు రాత్రి అనూహ్యంగా అచ్చెన్నను డిశ్చార్జ్ చేసేందుకు యత్నించారని ఆయన న్యాయవాది హరిబాబు ఆరోపించారు. దీని వెనుక ప్రభుత్వ ఒత్తిడి ఉండొచ్చంటూ ఆస్పత్రి వద్దకు వెళ్లారు. విషయం మీడియాకు ఎక్కటంతో ఆర్​ఎంవో హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. డిశ్ఛార్జి రద్దైందని న్యాయవాదికి నచ్చజెప్పారు.

నేడు డిశ్ఛార్జి?

మరోవైపు అచ్చెన్నాయుడుని ఇవాళ మధ్యాహ్నం డిశ్ఛార్జి చేయనున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి, ఇతర పోలీస్‌ అధికారులు గత రాత్రి అస్పత్రిని సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.