గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి.. కూరగాయలు కొనుగోలు చేసేందుకు మార్కెట్కు వెళ్లాడు. కూరగాయలు కొని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటేశ్వరరావు కిందపడిపోయాడు. అదే సమయంలో అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వెంకటేశ్వరరావు పైనుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచదవండి.