కృష్ణా జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన ఓ యువతి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో డీ ఫార్మసీ చదువుతోంది. ఆ యువతికి ఖమ్మం జిల్లాకు చెందిన కన్నెగంటి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తితో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. శ్రీధర్.. తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గుంటూరులోని ఓ హోటల్లో రెండు నెలలు ఉంచినట్లు బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత శ్రీధర్ తనను మోసం చేసి వెళ్లిపోయినట్లు తెలిపింది.
ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావటంతో.. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరులోని అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: