ETV Bharat / state

కిడ్నాప్​ చేసి భూమి రాయించుకున్న ముఠా అరెస్టు​ - కిడ్నాప్ కేసును ఛేదించిన గుంటూరు పోలీసులు

ధరణికోటలో ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్​ చేసి వారి భూమి రాయించుకున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయారావు కేసు వివరాలు వెల్లడించారు.

కిడ్నాప్​ చేసి భూమిని రాయించుకున్న ముఠా అరెస్ట్​
కిడ్నాప్​ చేసి భూమిని రాయించుకున్న ముఠా అరెస్ట్​
author img

By

Published : Dec 1, 2019, 7:07 PM IST

కిడ్నాప్​ చేసి భూమి రాయించుకున్న ముఠా అరెస్టు​

గుంటూరు జిల్లా ధరణికోటలో ఇద్దరు వ్యక్తుల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్​తో రూ.15 కోట్ల విలువైన భూమిని తమ పేరున రాయించుకున్న ముఠా సభ్యుల ఆటకట్టించారు. ఈ కేసులో బాచీ అనే కానిస్టేబుల్ సహా 12 మంది నిందితులను గుర్తించగా... వీరిలో 9 మందిని అరెస్టు చేశారు. ధరణికోటకు చెందిన రమేశ్ బాబు, అతని మేనమామ హనుమంతరావును కిడ్నాప్ చేశారు. రమేశ్​ కుటుంబసభ్యుల్ని బెదిరించారు. తర్వాత ఇద్దరినీ రిజస్ట్రేషన్ ఆఫీస్​కు తీసుకెళ్లి బలవంతంగా వారి భూమిని రాయించుకున్నారని గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయారావు వివరించారు. బాధితుడు రమేశ్... ఎస్పీకి ఫిర్యాదు చేశాకా... కిడ్నాప్, దౌర్జన్యం ఘటన వెలుగులోకి వచ్చింది.

కిడ్నాప్​ చేసి భూమి రాయించుకున్న ముఠా అరెస్టు​

గుంటూరు జిల్లా ధరణికోటలో ఇద్దరు వ్యక్తుల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్​తో రూ.15 కోట్ల విలువైన భూమిని తమ పేరున రాయించుకున్న ముఠా సభ్యుల ఆటకట్టించారు. ఈ కేసులో బాచీ అనే కానిస్టేబుల్ సహా 12 మంది నిందితులను గుర్తించగా... వీరిలో 9 మందిని అరెస్టు చేశారు. ధరణికోటకు చెందిన రమేశ్ బాబు, అతని మేనమామ హనుమంతరావును కిడ్నాప్ చేశారు. రమేశ్​ కుటుంబసభ్యుల్ని బెదిరించారు. తర్వాత ఇద్దరినీ రిజస్ట్రేషన్ ఆఫీస్​కు తీసుకెళ్లి బలవంతంగా వారి భూమిని రాయించుకున్నారని గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయారావు వివరించారు. బాధితుడు రమేశ్... ఎస్పీకి ఫిర్యాదు చేశాకా... కిడ్నాప్, దౌర్జన్యం ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇదీ చదవండి :

వ్యక్తిని కిడ్నాప్ చేసి... కోట్లు విలువ చేసే భూమి రాయించుకున్నారు...!

AP_GNT_03_01_KIDNAP_CASE_CHASED_AVB_3067949 REPORTER: P.SURYA RAO CAMERA: ALI ( ) గుంటూరు జిల్లా ధరణికోటలో ఇద్దరు వ్యక్తుల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ తో 15 కోట్ల రూపాయల విలువైన భూమిని తమ పేరున రాయించుకున్న ముఠాసభ్యుల ఆటకట్టించారు పోలీసులు. ఈ కేసులో బాచీ అనే కానిస్టేబుల్ సహా 12 మంది నిందితులను గుర్తించగా... వీరిలో 9 మందిని అరెస్టు చేశారు. సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసుకు సంబంధించిన వివరాలను గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావువెల్లడించారు. ధరణికోటకు చెందిన రమేశ్ బాబు, అతని మేనమామ హనుమంతరావును తెలివిగా కిడ్నాప్ చేసిన నిందితులు... వారిని వైర్లు, తాళ్లతో బంధించారు. విద్యుత్ షాకులు ఇస్తామని, విషం ఇంజక్షన్ ఇస్తామని....కుటుంబ సభ్యుల్ని చంపేస్తామంటూ బెదిరించారు. తర్వాత ఇద్దర్ని రిజస్ట్రేషన్ ఆఫీస్ కు తీసుకెళ్లి బలవంతంగా 15 కోట్ల విలువైన భూమిని రాయించుకున్నారు. బాధితుడు రమేశ్ గుంటూరు గ్రామీణ ఎస్పీకి పిర్యాదుతో కిడ్నాప్, దౌర్జన్యం ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ముఠా కిడ్నాప్, బెదిరింపులకు పాల్పడిందని ఎస్పీ విజయరావు చెప్పారు. ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. మళ్లీ ఇలాంటి ఘటనలు తలెత్తకుండా కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ విజయరావు చెప్పారు.....BYTE.... BYTE: విజయరావు, గుంటూరు గ్రామీణ ఎస్పీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.