ETV Bharat / state

అంబటిని అడ్డుకున్న జనసేన కార్యకర్తలు, ఆందోళన

గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామంలో జనసేన కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. తెదేపా, వైకాపా నాయకులు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. అంబటి రాంబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

author img

By

Published : Apr 11, 2019, 1:41 PM IST

దమ్మాలపాడులో అంబటిని అడ్డుకున్న జనసేన కార్యకర్తలు
దమ్మాలపాడులో అంబటిని అడ్డుకున్న జనసేన కార్యకర్తలు

గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామంలో జనసేన కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. తెదేపా, వైకాపా నాయకులు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. 247, 248 బూతులలో ఎన్నికలు జరుగుతున్నందున సభాపతి కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం, వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబులు వేరువేరుగా గ్రామానికి వచ్చారు. ముందు శివరాం కారును అడ్డుకున్న జనసేన కార్యకర్తలు... తర్వాత అంబటి రాంబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఒక దశలో పోలీసులను లెక్కచేయకుండా వాగ్వాదానికి దిగారు. పోలీసులను నెట్టుకుంటూ రోడ్డుపై బైఠాయించారు. రాంబాబుని ఇక్కడి నుంచి పంపితే గాని ఆందోళన విరమించమని డిమాండ్ చేశారు. దానితో పోలీసులు వెంటనే అంబటి రాంబాబును అక్కడి నుంచి పంపించారు.

దమ్మాలపాడులో అంబటిని అడ్డుకున్న జనసేన కార్యకర్తలు

గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామంలో జనసేన కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. తెదేపా, వైకాపా నాయకులు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. 247, 248 బూతులలో ఎన్నికలు జరుగుతున్నందున సభాపతి కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం, వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబులు వేరువేరుగా గ్రామానికి వచ్చారు. ముందు శివరాం కారును అడ్డుకున్న జనసేన కార్యకర్తలు... తర్వాత అంబటి రాంబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఒక దశలో పోలీసులను లెక్కచేయకుండా వాగ్వాదానికి దిగారు. పోలీసులను నెట్టుకుంటూ రోడ్డుపై బైఠాయించారు. రాంబాబుని ఇక్కడి నుంచి పంపితే గాని ఆందోళన విరమించమని డిమాండ్ చేశారు. దానితో పోలీసులు వెంటనే అంబటి రాంబాబును అక్కడి నుంచి పంపించారు.

Intro:Ap_Nlr_03_11_Rural_Abyardhi_Parisilana_Kiran_Avb_C1

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పోలింగ్ జరుగుతున్న తీరును తెదేపా అభ్యర్థి అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. డి.కే. డబ్ల్యు. కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో
ఈవీఎం మొరాయించడంతో,అధికారులను అడిగి పరిస్థితి తెలుసుకున్నారు. అనేక ప్రాంతాల్లో మొరాయిస్తున్న ఈవీఎంల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈవీఎంలు మొరాయించిన ప్రాంతాల్లో అధనపు సమయం ఇస్తారని అజీజ్ వెల్లడించారు. అభివృద్ధి వైపు ఓటర్లు ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
బైట్: అబ్దుల్ అజీజ్, నెల్లూరు రూరల్ తెదేపా అభ్యర్థి.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.