ETV Bharat / state

ఆ డిమాండు సరికాదు.. హైకోర్టులో వాదనలు వినిపించిన ప్రభుత్వ తరఫు అదనపు ఏజీ

author img

By

Published : Dec 1, 2022, 11:43 AM IST

HIGH COURT ON R5 ZONE : రాజధాని రైతులకే మొదట ప్లాట్లు ఇచ్చి.. తర్వాతే ఇతరులకు ఇవ్వాలనే పిటిషనర్ల వాదన సరికాదని ప్రభుత్వం తరఫు అదనపు ఏజీ సుధాకర్​రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. రాజధాని కోసం సమీకరించిన భూమిలో 5శాతం ఇళ్ల నిర్మాణం, ఇళ్ల స్థలాల కేటాయింపునకు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఎంతో మంది గూడు లేక చెట్లకింద నివసిస్తున్నారన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు.

HIGH COURT ON R5 ZONE
HIGH COURT ON R5 ZONE

HIGHCOURT : రాజధానికి భూములిచ్చిన రైతులకు మొదట అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చిన తర్వాతే ఇతరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే పిటిషనర్ల వాదన సరికాదని.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. అలాంటి నిబంధన సీఆర్‌డీఏ చట్టంలో లేదన్నారు. రాజధాని కోసం సమీకరించిన భూమిలో 5శాతం ఇళ్ల నిర్మాణం, ఇళ్ల స్థలాల కేటాయింపునకు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఎంతో మంది గూడు లేక చెట్లకింద నివసిస్తున్నారన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు.

రాజధాని ప్రాంతంలో పలు గ్రామాలు పీఎంఏవై పథకం కిందకు వస్తాయన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారం సీజే నేతృత్వంలోని బెంచ్‌ ముందు ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు అయ్యిందని.. ప్రస్తుత వ్యాజ్యాలను అక్కడికే పంపడం ఉత్తమం అని వాదనల ప్రారంభానికి ముందు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు అభ్యంతరం తెలిపారు. ప్రస్తుత వ్యాజ్యాలకు సీజే బెంచ్‌ ముందున్న వ్యాజ్యాలకు సంబంధం లేదన్నారు.

ఇప్పటికే రాజధాని ప్రాతంలో పలు సంస్థలకు భూములు కేటాయించారన్న సీఆర్‌డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి.. అప్పుడు అభ్యంతరం చెప్పని పిటిషనర్లు.. పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని అన్నారు. రాజధాని బృహత్తర ప్రణాళికను ఏ దశలోనైనా సవరించుకోవచ్చు అన్నారు. సీఆర్‌డీఏ చట్టం రాజధాని ప్రాంతానికే పరిమితం కాదన్నారు. సీఆర్‌డీఏ తరఫు మిగిలిన వాదలను వినేందుకు, పిటిషనర్ల రిప్లై వినేందుకు విచారణ డిసెంబర్‌ 5కు వాయిదా పడింది.

ఇవీ చదవండి:

HIGHCOURT : రాజధానికి భూములిచ్చిన రైతులకు మొదట అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చిన తర్వాతే ఇతరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే పిటిషనర్ల వాదన సరికాదని.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. అలాంటి నిబంధన సీఆర్‌డీఏ చట్టంలో లేదన్నారు. రాజధాని కోసం సమీకరించిన భూమిలో 5శాతం ఇళ్ల నిర్మాణం, ఇళ్ల స్థలాల కేటాయింపునకు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఎంతో మంది గూడు లేక చెట్లకింద నివసిస్తున్నారన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు.

రాజధాని ప్రాంతంలో పలు గ్రామాలు పీఎంఏవై పథకం కిందకు వస్తాయన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారం సీజే నేతృత్వంలోని బెంచ్‌ ముందు ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు అయ్యిందని.. ప్రస్తుత వ్యాజ్యాలను అక్కడికే పంపడం ఉత్తమం అని వాదనల ప్రారంభానికి ముందు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు అభ్యంతరం తెలిపారు. ప్రస్తుత వ్యాజ్యాలకు సీజే బెంచ్‌ ముందున్న వ్యాజ్యాలకు సంబంధం లేదన్నారు.

ఇప్పటికే రాజధాని ప్రాతంలో పలు సంస్థలకు భూములు కేటాయించారన్న సీఆర్‌డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి.. అప్పుడు అభ్యంతరం చెప్పని పిటిషనర్లు.. పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని అన్నారు. రాజధాని బృహత్తర ప్రణాళికను ఏ దశలోనైనా సవరించుకోవచ్చు అన్నారు. సీఆర్‌డీఏ చట్టం రాజధాని ప్రాంతానికే పరిమితం కాదన్నారు. సీఆర్‌డీఏ తరఫు మిగిలిన వాదలను వినేందుకు, పిటిషనర్ల రిప్లై వినేందుకు విచారణ డిసెంబర్‌ 5కు వాయిదా పడింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.