ETV Bharat / state

లంక గ్రామాల్లో జోరుగా సహాయక చర్యలు

author img

By

Published : Aug 17, 2019, 9:11 PM IST

గుంటూరు జిల్లాలోని లంక గ్రామాల్లో.. వరద కారణంగా రహదారులు నీటిలో కలిసిపోయాయి. అధికారులు పడవలతో సహాయ చర్యలు చేశారు.

లంకగ్రామాలకు మొదలైన సహాయక చర్యలు
లంకగ్రామాలకు మొదలైన సహాయక చర్యలు

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే సహాయక చర్యలు జోరందుకున్నాయి. గుంటూరు జిల్లాలోని లంక గ్రామాల్లో అధికారులు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. లంక గ్రామాల్లో ఉండిపోయిన వారి కోసం మంచినీరు, బియ్యం, కూరగాయలు పడవల ద్వారా తరలించారు.అధికారులు వాటిని గ్రామస్థులకు అందజేశారు. వరదల కారణంగా పంటలు పూర్తి స్థాయిలో పాడైపోయాయని... రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 50 నుంచి 80 వేల రూపాయల మేర పెట్టుబడులు పెట్టి నష్టపోయామని వాపోయారు. వరద నీటి కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు.. ఇప్పుడిప్పుడే కొన్ని గ్రామాలకు పునరుద్ధరిస్తున్నారు. లైన్లన్నీ తనిఖీ చేసి కరెంటు సరఫరా కోసం చర్యలు చేపట్టారు.

లంకగ్రామాలకు మొదలైన సహాయక చర్యలు

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే సహాయక చర్యలు జోరందుకున్నాయి. గుంటూరు జిల్లాలోని లంక గ్రామాల్లో అధికారులు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. లంక గ్రామాల్లో ఉండిపోయిన వారి కోసం మంచినీరు, బియ్యం, కూరగాయలు పడవల ద్వారా తరలించారు.అధికారులు వాటిని గ్రామస్థులకు అందజేశారు. వరదల కారణంగా పంటలు పూర్తి స్థాయిలో పాడైపోయాయని... రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 50 నుంచి 80 వేల రూపాయల మేర పెట్టుబడులు పెట్టి నష్టపోయామని వాపోయారు. వరద నీటి కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు.. ఇప్పుడిప్పుడే కొన్ని గ్రామాలకు పునరుద్ధరిస్తున్నారు. లైన్లన్నీ తనిఖీ చేసి కరెంటు సరఫరా కోసం చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి

ఊహించని వరదతో ఉపాధికి దూరం

Intro:AP_RJY_58_17_VADAPALLI_SAMAVESAM_AV_AP10018
తూర్పుగోదావరిజిల్లా
కంట్రిబ్యూటర్‌: ఎస్‌.వి.కనికిరెడ్డి
కొత్తపేట

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతి
శనివారం స్వామి దర్శనానికి పెరుగుతున్న భక్తులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయ శాఖ
ప్రాంతీయ సంయుక్త కమీషనర్‌ త్రినాథ్‌రావు, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిలు అన్నారు. వాడపల్లి ఆలయంలో వసతుల మార్పులకు
సంబంధించి భక్తులు, పోలీస్‌, దేవాదాయ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతీ శనివారం నానాటికీ పెరుగుతున్న
భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ సమస్యలు, ప్రదక్షిణలు చేసే స్థల పరిధి పెంపు, అన్నదానం, ఆలయంలో పారిశుధ్యం, తదితర
సమస్యలపై చర్చించారు. భక్తులను సమస్యలు అడిగితెలుసుకున్నారు. ఆలయంలో వర్షం వస్తే నీరు తొందరగా బయటికి పోయే
మార్గం లేదని అందువల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని , మోకాళ్ళ ప్రదక్షిణ చేసే భక్తుల వల్ల ఇతరులు కొంచెం ఇబ్బంది
పడుతున్నారని వారికి ప్రత్యేక సమయం కేటాయిస్తే బాగుంటుందన్నారు ఆలయంలో ప్రదక్షిణలు చేసే భక్తులకు ఒకేసారి లోపలికి
రావడం వల్ల వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఊపిరి తీసుకోలేకపోతున్నారని, దీని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని,
వయో వృద్ధులు, చిన్నపిల్లలను తీసుకొచ్చే వారికి తిరుమలలో మాదిరి టైం స్లాట్ దర్శనం కల్పించాలని కోరారు.
ప్రతి శనివారం ప్రసుత్తం 28మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుండగా వచ్చే వారం నుంచి 50 మందికి పెంచుతామని
ఆలయం సిబ్బంది నుంచి కూడా ఒక 100 మంది సేవ చేసే వారిని అందిస్తే తమకి మరింత సహాయంగా ఉంటారని అమలాపురం
డీఎస్పీ బాషా అన్నారు


Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.