ETV Bharat / state

గుంటూరు జిల్లాలో 306కు చేరిన కరోనా కేసులు

author img

By

Published : May 1, 2020, 6:28 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు 300 దాటాయి. ఇవాళ కొత్తగా 19 కేసులు నమోదు కావటంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 306కు చేరింది.

guntur corona news
guntur corona news

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇవాళ కొత్తగా 19కేసులు నమోదు కావటంతో మొత్తం కేసుల సంఖ్య 306కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో నరసారావుపేటలో 17, గుంటూరు1, ధూలిపాళ్లలో ఒకటి ఉన్నాయి. తాజా కేసులతో కలిపి నరసారాపేటలో పాజిటివ్ సంఖ్య 121కి చేరింది. ఇక్కడ వరవకట్ట ప్రాంతంలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇక గుంటూరు నగరంలోనూ పాజిటివ్ కేసులు 146కి చేరుకున్నాయి. జిల్లాలో కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకూ 97మంది ఇళ్లకు వెళ్లారు. ఇంకా 201 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కరోనా వచ్చిన వారికి గుంటూరు ఐడి ఆసుపత్రి, మంగళగిరి ఎన్.ఆర్.ఐ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా గుంటూరు జీజీహెచ్ తో పాటు, లలిత ఆసుపత్రి, తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి, వడ్లమూడిలోని డీవీసీ ఆసుపత్రి, తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ 19కు చికిత్స అందించాలని నిర్ణయించారు. అక్కడ వైద్య సిబ్బందితో పాటు ఇతర పరికరాలను సిద్ధం చేశారు.

రెడ్ జోన్లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ర్యాపిడ్ కిట్లు, ట్రూనాట్ పరికరాల ద్వారా క్షేత్రస్థాయిలోనే రక్తనమూనాలు సేకరించి వాటిని పరీక్షిస్తున్నారు. గుంటూరు వైద్యకళాశాలలోని ల్యాబ్ కు పంపించి... అక్కడ కరోనా సోకిందా లేదా అనేది నిర్ధారిస్తున్నారు. లాక్ డౌన్ అమలును కఠినతరం చేశారు. నరసారావుపేటలో పూర్తి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఎవరూ బయటకు రావొద్దని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి ఆయన చెట్టుకు 'మోదీ' సహా.. వందల రకాల పండ్లు

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇవాళ కొత్తగా 19కేసులు నమోదు కావటంతో మొత్తం కేసుల సంఖ్య 306కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో నరసారావుపేటలో 17, గుంటూరు1, ధూలిపాళ్లలో ఒకటి ఉన్నాయి. తాజా కేసులతో కలిపి నరసారాపేటలో పాజిటివ్ సంఖ్య 121కి చేరింది. ఇక్కడ వరవకట్ట ప్రాంతంలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇక గుంటూరు నగరంలోనూ పాజిటివ్ కేసులు 146కి చేరుకున్నాయి. జిల్లాలో కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకూ 97మంది ఇళ్లకు వెళ్లారు. ఇంకా 201 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కరోనా వచ్చిన వారికి గుంటూరు ఐడి ఆసుపత్రి, మంగళగిరి ఎన్.ఆర్.ఐ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా గుంటూరు జీజీహెచ్ తో పాటు, లలిత ఆసుపత్రి, తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి, వడ్లమూడిలోని డీవీసీ ఆసుపత్రి, తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ 19కు చికిత్స అందించాలని నిర్ణయించారు. అక్కడ వైద్య సిబ్బందితో పాటు ఇతర పరికరాలను సిద్ధం చేశారు.

రెడ్ జోన్లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ర్యాపిడ్ కిట్లు, ట్రూనాట్ పరికరాల ద్వారా క్షేత్రస్థాయిలోనే రక్తనమూనాలు సేకరించి వాటిని పరీక్షిస్తున్నారు. గుంటూరు వైద్యకళాశాలలోని ల్యాబ్ కు పంపించి... అక్కడ కరోనా సోకిందా లేదా అనేది నిర్ధారిస్తున్నారు. లాక్ డౌన్ అమలును కఠినతరం చేశారు. నరసారావుపేటలో పూర్తి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఎవరూ బయటకు రావొద్దని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి ఆయన చెట్టుకు 'మోదీ' సహా.. వందల రకాల పండ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.