ETV Bharat / state

రేపల్లె తీర ప్రాంతాల్లో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు

గుంటూరు జిల్లా రేపల్లె గ్రీన్ జోన్​లో ఉంది. అక్కడ ఇప్పటివరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసూ నమోదు కాలేదు. ఇక మీదట కూడా గ్రీన్ జోన్ కొనసాగేలా అధికారులు చర్యలు పటిష్టం చేశారు. కొవిడ్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

author img

By

Published : May 3, 2020, 12:38 PM IST

guntur district repalle in green zone
రేపల్లె తీర ప్రాంతాల్లో కరోనా నివారణకు పటిష్ట చర్యలు

గుంటూరు జిల్లా రేపల్లె తీర ప్రాంతాల్లో కరోనా నివారణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. రేపల్లె నియోజకవర్గం గ్రీన్ జోన్​లో ఉన్న కారణంగా.. అదే పరిస్థితిని ఇక మీదట కూడా కొనసాగించేలా కసరత్తు చేస్తున్నారు. ఎవరూ వైరస్ బారిన పడకుండా ఉండేలా పటిష్టమైన ముందు జాగ్రత్త చర్యలు అమలు చేస్తున్నారు.

అత్యవసర వాహనాలను మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అనవసరంగా బయట తిరిగితే వాహనాలు సీజ్ చేస్తామని పట్టణ సీఐ సాంబశివరావు హెచ్చరించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలంతా సహకరించి కరోనాను తరిమికొట్టాలని సూచించారు.

గుంటూరు జిల్లా రేపల్లె తీర ప్రాంతాల్లో కరోనా నివారణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. రేపల్లె నియోజకవర్గం గ్రీన్ జోన్​లో ఉన్న కారణంగా.. అదే పరిస్థితిని ఇక మీదట కూడా కొనసాగించేలా కసరత్తు చేస్తున్నారు. ఎవరూ వైరస్ బారిన పడకుండా ఉండేలా పటిష్టమైన ముందు జాగ్రత్త చర్యలు అమలు చేస్తున్నారు.

అత్యవసర వాహనాలను మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అనవసరంగా బయట తిరిగితే వాహనాలు సీజ్ చేస్తామని పట్టణ సీఐ సాంబశివరావు హెచ్చరించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలంతా సహకరించి కరోనాను తరిమికొట్టాలని సూచించారు.

ఇవీ చదవండి:

ఇంటికి వెళ్తున్న కరోనా విజేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.