ETV Bharat / state

ఇంటికి వెళ్తున్న కరోనా విజేతలు - గుంటూరు జిల్లాలో కరోనా తగ్గు ముఖం తాజా వార్తలు

గుంటూరు జిల్లాలో కరోనా తగ్గు ముఖం పడుతుంది. కోలుకుంటున్న బాధితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యి ఇంటికి వెళ్తున్నారు. ఈ తురుణంలో నిన్న మంగళగిరి ఎన్​ఆర్​ఐ అసుపత్రి నుంచి డిశ్చార్జ్​ 32 మందిని ఇంటికి పంపించారు. వీరితో కలెక్టర్​ శామ్యూల్​ మాట్లాడి పలు సూచనలు చేశారు.

32 corona patients discharged
ఎన్​ఆర్​ఐ ఆసుపత్రి నుంచి కరోనా బాధితుల డిశ్చార్జ్
author img

By

Published : May 3, 2020, 10:53 AM IST

గుంటూరు జిల్లాలో కరోనా నుంచి కోలుకున్న 32 మంది నిన్న మంగళగిరి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. వైరస్‌ నయమైన వారితో కలెక్టర్ శామ్యూల్‌ ఆనంద్‌ మాట్లాడారు. ఇంటికి వెళ్లాక 14 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉండాలని నిర్దేశించారు. కుటుంబ సభ్యులతోనూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. వైద్యుల సలహాలు తీసుకుంటూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాగా డిశ్చార్జ్‌ అయిన 32 మందిలో నరసరావుపేటకు చెందిన వారు 20, గుంటూరు నగరానికి చెందిన వారు 11 మంది, పొన్నూరుకు చెందిన వారు ఒకరున్నారు. వీరిని ప్రత్యేక వాహనాల్లో స్వస్థలాలకు తరలించారు.

గుంటూరు జిల్లాలో కరోనా నుంచి కోలుకున్న 32 మంది నిన్న మంగళగిరి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. వైరస్‌ నయమైన వారితో కలెక్టర్ శామ్యూల్‌ ఆనంద్‌ మాట్లాడారు. ఇంటికి వెళ్లాక 14 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉండాలని నిర్దేశించారు. కుటుంబ సభ్యులతోనూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. వైద్యుల సలహాలు తీసుకుంటూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాగా డిశ్చార్జ్‌ అయిన 32 మందిలో నరసరావుపేటకు చెందిన వారు 20, గుంటూరు నగరానికి చెందిన వారు 11 మంది, పొన్నూరుకు చెందిన వారు ఒకరున్నారు. వీరిని ప్రత్యేక వాహనాల్లో స్వస్థలాలకు తరలించారు.

ఇవీ చూడండి...

'కరోనాపై యుద్ధంలో వైద్యులే సైనికులు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.