ETV Bharat / state

ACCIDENT: బస్సును ఓవర్​ టేక్​ చేయబోయాడు.. కానీ ఇంతలోనే..!

author img

By

Published : Jul 13, 2021, 7:28 PM IST

చిలకలూరిపేటలోని చెన్నై-కోల్​కతా 16వ నెంబర్ జాతీయ రహదారిలోని ఓ వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్​పై వెళుతున్న ఓ వ్యక్తి.. బస్సును ఓవర్​ టేక్​ చేయబోయి కిందపడ్డాడు. వెనకే వస్తున్న లారీ అతని మీదనుంచి దూసుకెళ్లింది. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

accident
రోడ్డు ప్రమాదం
చిలకలూరి పేటలో రోడ్డు ప్రమాదం

బ్రిడ్జి​పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది. ప్రకాశం జిల్లా తాళ్లూరుకు చెందిన మాతాని ప్రసాద్​ (26) ద్విచక్రవాహనంపై గుంటూరు వెళ్లి చెన్నై-కోలకత్తా 16వ నెంబర్ జాతీయ రహదారిలో తిరిగి వస్తున్నాడు.

ఓగేరు వాగు వంతెనపై వెళుతున్న బస్సును ఓవరు టేక్​ చేయబోయి బస్సుకు తగిలి కిందపడ్డాడు. వెనకనుంచి వస్తున్న లారీ అతని మీద నుంచి దూసుకెళ్లింది. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని చిలకలూరిపేట అర్బన్ ఎస్ఐ నరసదాసు పరిశీలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆత్మహత్య చేసుకుందామని పట్టాలపై పడుకున్నాడు.. చివరికి..?

చిలకలూరి పేటలో రోడ్డు ప్రమాదం

బ్రిడ్జి​పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది. ప్రకాశం జిల్లా తాళ్లూరుకు చెందిన మాతాని ప్రసాద్​ (26) ద్విచక్రవాహనంపై గుంటూరు వెళ్లి చెన్నై-కోలకత్తా 16వ నెంబర్ జాతీయ రహదారిలో తిరిగి వస్తున్నాడు.

ఓగేరు వాగు వంతెనపై వెళుతున్న బస్సును ఓవరు టేక్​ చేయబోయి బస్సుకు తగిలి కిందపడ్డాడు. వెనకనుంచి వస్తున్న లారీ అతని మీద నుంచి దూసుకెళ్లింది. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని చిలకలూరిపేట అర్బన్ ఎస్ఐ నరసదాసు పరిశీలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆత్మహత్య చేసుకుందామని పట్టాలపై పడుకున్నాడు.. చివరికి..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.