ETV Bharat / state

కంకర లారీ ఢీకొనటంతో 16 గొర్రెలు మృతి

author img

By

Published : Apr 4, 2021, 9:34 AM IST

గొర్రెల మంద పైకి కంకర లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 16 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి.

accident
ప్రమాదంలో గొర్రెలు మృతి

గుంటూరు జిల్లా తెనాలి మండలం కాజీపేట వద్ద గొర్రెల మంద పైకి కంకర లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 16 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మరో 23 గొర్రెలకు తీవ్రంగా గాయాలయ్యాయి. మహబూబ్​నగర్ నుంచి తెనాలికి గొర్రెల మందను తోలుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని గొర్రెల కాపరులు వివరించారు. ఈ ప్రమాదంలో ఆరులక్షల వరకు నష్టం వాటిల్లినట్లు వారు వాపోతున్నారు. లారీ డ్రైవర్​ని పట్టుకున్న గొర్రెల కాపరులు.. తెనాలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గుంటూరు జిల్లా తెనాలి మండలం కాజీపేట వద్ద గొర్రెల మంద పైకి కంకర లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 16 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మరో 23 గొర్రెలకు తీవ్రంగా గాయాలయ్యాయి. మహబూబ్​నగర్ నుంచి తెనాలికి గొర్రెల మందను తోలుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని గొర్రెల కాపరులు వివరించారు. ఈ ప్రమాదంలో ఆరులక్షల వరకు నష్టం వాటిల్లినట్లు వారు వాపోతున్నారు. లారీ డ్రైవర్​ని పట్టుకున్న గొర్రెల కాపరులు.. తెనాలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండీ.. స్పెషల్ డ్రైవ్ : 90 ఎంఎల్ విస్కీ​ టెట్రా ప్యాక్​లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.