గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం కోరుతాడిపర్రులో ఆలయ నిర్మాణానికి 23లక్షల రూపాయల దాకా విరాళాలు పోగయ్యాయి. 200 ఏళ్ల నాటి శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం పక్కనే శ్రీస్వరాజ్యలక్ష్మి అమ్మవారి గుడి ప్రతిష్ఠకు పూనుకున్న గ్రామస్థులు.. చందాల కోసం ఓ వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. గ్రామస్థులు, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్నవారు సైతం ముందుకురావటంతో 2లక్షలు లక్ష్యంగా మొదలైన సేకరణ..22 లక్షలకుపైగా చేరింది. త్వరలోనే రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ ఉంటుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: Raghurama letter to CM Jagan: 'సంపూర్ణ మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉండాలి'