ETV Bharat / state

జీజీహెచ్​కు కొనసాగుతున్న కొవిడ్ రోగుల తాకిడి

గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రికి కొవిడ్‌ రోగుల తాకిడి కొనసాగుతోంది. సామర్థ్యానికి మించి కరోనా రోగులు వస్తుండడంతో బెడ్లు సరిపోవటం లేదు. రోగుల తాకిడిని తట్టుకునేందుకు అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు.

author img

By

Published : May 2, 2021, 8:10 AM IST

జీజీహెచ్​కు కొనసాగుతున్న కొవిడ్ రోగుల తాకిడి

ఓవైపు కరోనా చనిపోయిన వారి మృతదేహాలు.. మరోవైపు వైరస్‌ నిర్ధరణ పరీక్షలు.. ఇంకో వైపు చికిత్స కోసం రోగుల ఎదురుచూపులు.. ఇదీ గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో దయనీయ పరిస్థితి. జీజీహెచ్​ మెుత్తం కొవిడ్‌ రోగులతోనే నిండిపోయింది. ఆసుపత్రిలో చికిత్సకు పడకలు లేక.. ఆసుపత్రి పరిసరాల్లో కరోనా బాధితులు నేలపైనే పడుకుంటున్నారు. కొందరు కుర్చీల్లో, మరికొందరు సమీప ప్రాంతాల్లో అగచాట్లు పడుతున్నారు.

జీజీహెచ్​ కు కరోనా రోగుల తాకిడి..పెరుగుతుండడంతో పడకలు సరిపోవడం లేదు. మరిన్నివార్డులను కొవిడ్‌ రోగుల చికిత్స కోసం ఏర్పాటు చేసే దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

జీజీహెచ్​లో​ డిశ్చార్జులు తక్కువగా ఉండటం.. చికిత్స కోసం కొత్తగా చేరే రోగులు భారీగా ఉండడంతో సమస్య ఎదురవుతోంది. రోగులకు..వారి బంధువులకు సమాధానం చెప్పలేక వైద్యులు, సిబ్బంది తలలు పట్టుకున్నారు. పెరుగుతున్న రోగుల తాకిడి తట్టుకునేలా.. డిశ్చార్జులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఇదీ చదవండి:

కర్నూలు: ప్రైవేటు ఆసుపత్రిలో రెండు రోజుల్లో 9 మంది మృతి!

సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు మార్కింగ్ విధానం

ఓవైపు కరోనా చనిపోయిన వారి మృతదేహాలు.. మరోవైపు వైరస్‌ నిర్ధరణ పరీక్షలు.. ఇంకో వైపు చికిత్స కోసం రోగుల ఎదురుచూపులు.. ఇదీ గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో దయనీయ పరిస్థితి. జీజీహెచ్​ మెుత్తం కొవిడ్‌ రోగులతోనే నిండిపోయింది. ఆసుపత్రిలో చికిత్సకు పడకలు లేక.. ఆసుపత్రి పరిసరాల్లో కరోనా బాధితులు నేలపైనే పడుకుంటున్నారు. కొందరు కుర్చీల్లో, మరికొందరు సమీప ప్రాంతాల్లో అగచాట్లు పడుతున్నారు.

జీజీహెచ్​ కు కరోనా రోగుల తాకిడి..పెరుగుతుండడంతో పడకలు సరిపోవడం లేదు. మరిన్నివార్డులను కొవిడ్‌ రోగుల చికిత్స కోసం ఏర్పాటు చేసే దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

జీజీహెచ్​లో​ డిశ్చార్జులు తక్కువగా ఉండటం.. చికిత్స కోసం కొత్తగా చేరే రోగులు భారీగా ఉండడంతో సమస్య ఎదురవుతోంది. రోగులకు..వారి బంధువులకు సమాధానం చెప్పలేక వైద్యులు, సిబ్బంది తలలు పట్టుకున్నారు. పెరుగుతున్న రోగుల తాకిడి తట్టుకునేలా.. డిశ్చార్జులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఇదీ చదవండి:

కర్నూలు: ప్రైవేటు ఆసుపత్రిలో రెండు రోజుల్లో 9 మంది మృతి!

సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు మార్కింగ్ విధానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.