అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరుకి చెందిన ఆరమళ్ల రవి (39)... గత ఏడాది 8 ఎకరాల్లో పొగాకు, వరి సాగు చేశాడు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాడు. ఆశించిన దిగుబడులు రాలేదు. ఈ ఏడాది కూడా పంటలో నష్టం వచ్చింది.
ఇప్పటికే 5 లక్షల రూపాయల అప్పులు ఉండటంతో మనో ధైర్యం కోల్పోయిన రవి... పొలం వద్ద పురుగుల మందు తాగాడు. పక్క పొలంలో రైతులు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. భార్య, ఇద్దరు కుమారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: