ETV Bharat / state

గుప్త నిధుల కోసం తవ్వకాలు... నలుగురు అరెస్ట్​

author img

By

Published : Apr 19, 2020, 10:56 AM IST

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన నగులురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

గుప్త నిధుల కోసం తవ్వకాలు... నలుగురు అరెస్ట్​
గుప్త నిధుల కోసం తవ్వకాలు... నలుగురు అరెస్ట్​

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల పరిధిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్న వారు పోలీసులకు చిక్కారు. మండలంలోని శివారు ప్రాంతం ఎడ్లపాడు పరిధి పుట్టకోట్ వద్ద జేసీబీ సాయంతో తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్​ఐ సురేష్ నలుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం వారిని విచారణ చేయగా గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులు మెడికొండూరు మండలం పెరచర్లకు చెందిన వారిగా గుర్తించారు. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ సురేష్​ వెల్లడించారు.

ఇదీ చూడండి:

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల పరిధిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్న వారు పోలీసులకు చిక్కారు. మండలంలోని శివారు ప్రాంతం ఎడ్లపాడు పరిధి పుట్టకోట్ వద్ద జేసీబీ సాయంతో తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్​ఐ సురేష్ నలుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం వారిని విచారణ చేయగా గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులు మెడికొండూరు మండలం పెరచర్లకు చెందిన వారిగా గుర్తించారు. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ సురేష్​ వెల్లడించారు.

ఇదీ చూడండి:

వీడిన గుప్తనిధుల మిస్టరీ.. 10 మంది అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.