ETV Bharat / state

గుంటూరు గడ్డ... కరోనాకు అడ్డా..!

author img

By

Published : Jun 11, 2020, 7:28 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా తాకిడి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరో ఎనిమిది కేసులు నమోదు కాగా జీజీహెచ్​లో కరోనా సోకిన మహిళకు అక్కడి వైద్యులు సిజేరియన్ చేయడం వల్ల 8 మంది వైద్యులు, ఇద్దరు నర్సులు, వైద్యసిబ్బంది హోం క్వారంటైన్​లోకి వెళ్లారు.

eight more cases recorded
గుంటూరు జిల్లాలో కరోనా తాకిడి

గుంటూరు జిల్లాను కరోనా వెంటాడుతూనే ఉంది. ఇవాళ మరో 8 కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. తాడేపల్లి, సత్తెనపల్లిలో మూడేసి పాజిటివ్ కేసులు నమోదు కాగా... గుంటూరు ఏటీ అగ్రహారం, సంజీవయ్య నగర్​లో ఒక్కో కేసు నిర్ధరణ అయ్యింది. ఇటీవల హైదరాబాద్​లో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు సత్తెనపల్లిలో నిర్వహించారు. అదే కుటుంబంలోని ముగ్గురికి కరోనా సోకింది. తాజా కేసులతో జిల్లాలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 600 దాటాయి. మొత్తం కేసుల్లో నాలుగోవంతు కేసులు యాక్టివ్​గా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ద్వారా కేసుల తాకిడి పెరుగుతున్నట్లు అదికారులు గుర్తించారు.

గుంటూరు జిల్లాను కరోనా వెంటాడుతూనే ఉంది. ఇవాళ మరో 8 కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. తాడేపల్లి, సత్తెనపల్లిలో మూడేసి పాజిటివ్ కేసులు నమోదు కాగా... గుంటూరు ఏటీ అగ్రహారం, సంజీవయ్య నగర్​లో ఒక్కో కేసు నిర్ధరణ అయ్యింది. ఇటీవల హైదరాబాద్​లో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు సత్తెనపల్లిలో నిర్వహించారు. అదే కుటుంబంలోని ముగ్గురికి కరోనా సోకింది. తాజా కేసులతో జిల్లాలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 600 దాటాయి. మొత్తం కేసుల్లో నాలుగోవంతు కేసులు యాక్టివ్​గా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ద్వారా కేసుల తాకిడి పెరుగుతున్నట్లు అదికారులు గుర్తించారు.

ఇవీ చూడండి...

కరోనా ఉందని తెలియక ఆపరేషన్.. క్వారంటైన్​కు వైద్యులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.