ETV Bharat / state

"కాటి" కష్టాలు... మృతదేహాన్ని శ్మశానానికి చేర్చేందుకు పడరానిపాట్లు!

గుంటూరు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వరద నీరు కారణంగా ఓ వ్యక్తి మృతదేహాన్ని శ్మశానానికి చేర్చేందుకు గ్రామస్థులు, అతని కుటుంబసభ్యులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

author img

By

Published : Aug 15, 2019, 1:41 PM IST

Updated : Aug 15, 2019, 2:12 PM IST

వరద
పడవ పాడిని మోసింది

గుంటూరు కొల్లూరు మండలంలో వరద కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. క్రీస్తులంకలో ధర్మారావు అనే వ్యక్తి చనిపోగా.. అతని మృతదేహాన్ని శ్మశానానికి చేర్చేందుకు కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్మశానానికి వెళ్లే దారి పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. చివరికి గత్యంతరం లేక నాటుపడవ సాయంతో మృతదేహాన్నిశ్మశానానికి చేర్చారు. ఓ గట్టుపై అంత్యక్రియలు జరగగా.. మరో గట్టుపై నుంచి బంధువులు నిలబడి వీక్షిస్తూ ఉన్నారు.

పడవ పాడిని మోసింది

గుంటూరు కొల్లూరు మండలంలో వరద కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. క్రీస్తులంకలో ధర్మారావు అనే వ్యక్తి చనిపోగా.. అతని మృతదేహాన్ని శ్మశానానికి చేర్చేందుకు కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్మశానానికి వెళ్లే దారి పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. చివరికి గత్యంతరం లేక నాటుపడవ సాయంతో మృతదేహాన్నిశ్మశానానికి చేర్చారు. ఓ గట్టుపై అంత్యక్రియలు జరగగా.. మరో గట్టుపై నుంచి బంధువులు నిలబడి వీక్షిస్తూ ఉన్నారు.

Last Updated : Aug 15, 2019, 2:12 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.