గుంటూరు సమీపంలోని అడవితక్కెళ్లపాడులోని కొవిడ్ కేర్ సెంటర్లో శనివారం దీపావళి వేడుకలు జరిగాయి. పండగ వేళ కుటుంబానికి దూరంగా ఉన్నామని రోగులు బాధపడకుండా ఉండేందుకు అధికారులు ఈ చిరు ప్రయత్నం చేశారు. ఈ ఆలోచన కొవిడ్ కేంద్రాల్లో యోగా తరగతులు నిర్వహిస్తున్న పతంజలి శ్రీనివాస్కు రాగా అధికారులతో పంచుకున్నారు. కరోనా బాధితులు భౌతిక దూరం పాటిస్తూనే ఆనందంగా బాణసంచా కాల్చారు. కొవిడ్ కేర్ సెంటర్ ఇంఛార్జ్ పురుషోత్తం, వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి