ETV Bharat / state

'వరద బాధిత రైతులకు రూ.25 వేల పరిహారం ప్రకటించండి'

కృష్ణా నది వరదతో నష్టపోయిన కృష్ణా , గుంటూరు రైతులను ఆదుకోవాలని కోరుతూ సీపీఐ, రైతు సంఘాల నేతలు రెవిన్యూ శాఖ మంత్రికి వినతి పత్రం అందించారు. ప్రభుత్వం ప్రకటించిన 5 వేల రూపాయలు ఏ మాత్రం సరిపోవన్నారు.

author img

By

Published : Aug 20, 2019, 11:46 PM IST

'వరద బాధిత రైతన్నలకు రూ.25 వేల పరిహారం ప్రకటించండి'
'వరద బాధిత రైతన్నలకు రూ.25 వేల పరిహారం ప్రకటించండి'

కృష్ణా నది వరద ప్రభావ ప్రాంతాల్లో తీవ్రంగా పంటలు, నివాసాలు నష్టపోయిన బాధితులకు వెంటనే పరిహారం అందించి, ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. రైతు సంఘాల నాయకులు, సీపీఐ నేతలతో కలిసి.. రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను కలిసి, వినతిపత్రం అందజేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో పర్యటించి రైతుల స్థితిగతులను పరిశీలించాలని కోరారు. బాధితుల్లో 75 శాతం మంది కౌలు రైతులే ఉన్నారన్న రామకృష్ణ... వారిని ఆదుకోడానికి ఎకరానికి రూ. 20వేల నుంచి రూ. 25 వేలు పరిహారం ప్రకటించాలన్నారు. వరదలతో పత్తి, మినప రైతులు తీవ్రంగా నష్టపోయారని, తిరిగి పంటలు వేసుకునేలా ఆర్థికసాయం చేయాలని కోరారు.

'వరద బాధిత రైతన్నలకు రూ.25 వేల పరిహారం ప్రకటించండి'

కృష్ణా నది వరద ప్రభావ ప్రాంతాల్లో తీవ్రంగా పంటలు, నివాసాలు నష్టపోయిన బాధితులకు వెంటనే పరిహారం అందించి, ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. రైతు సంఘాల నాయకులు, సీపీఐ నేతలతో కలిసి.. రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను కలిసి, వినతిపత్రం అందజేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో పర్యటించి రైతుల స్థితిగతులను పరిశీలించాలని కోరారు. బాధితుల్లో 75 శాతం మంది కౌలు రైతులే ఉన్నారన్న రామకృష్ణ... వారిని ఆదుకోడానికి ఎకరానికి రూ. 20వేల నుంచి రూ. 25 వేలు పరిహారం ప్రకటించాలన్నారు. వరదలతో పత్తి, మినప రైతులు తీవ్రంగా నష్టపోయారని, తిరిగి పంటలు వేసుకునేలా ఆర్థికసాయం చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

24 కిలోమీటర్లు... భయం.. భయంగా!

Intro:ap_knl_112_20_rahadaripai_vanta_rasthoroko_av_ap10131
రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా.
శీర్షిక: ప్రధాన రహదారిపై వంటావార్పు


Body:కర్నూలు జిల్లా కోడుమూరులో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు ప్రధాన రహదారిపై వంటావార్పు కార్యక్రమం చేశారు. తాగు నీళ్లు వెళ్తున్నట్లు నిరసన విరమించాలని అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నెలకోసారి రోడ్డెక్కి నిరసన చేయలేమంటూ తమకు శాశ్వత పరిష్కారం చేయాలంటూ అధికారులతో మహిళలు, నాయకులు వాగ్వివాదానికి దిగారు. ప్రజలు గ్రామాభివృద్ధి కమిటీ నాయకులు కలెక్టర్ ఎమ్మెల్యే వచ్చి తీరాల్సిందేనని తమకు శాశ్వత పరిష్కారం చేయాలంటూ వాగ్వివాదానికి దిగారు.


Conclusion:ఈ సందర్భంగా కర్నూలు- బళ్ళారి ప్రధాన రహదారిపై కోడుమూరు మాజీ సర్పంచ్ సి బి లతా, మహిళలు నాయకులు వంట చేశారు. ప్రధాన రహదారిపై కూర్చొని అల్పాహారం స్వీకరించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.