ETV Bharat / state

కరోనా రోగులకు.. ప్రత్యేక​ కేంద్రం, క్వారంటైన్​ సదుపాయాలు ఏర్పాటు

author img

By

Published : May 1, 2021, 5:59 PM IST

గుంటూరు జిల్లా పొన్నూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వైరస్​ బాధితుల చికిత్సకు కోవిడ్​ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిడుబ్రోలు లోని ప్రభుత్వ పాఠశాలలో క్వారంటైన్​కు సదుపాయాలు కల్పించారు.

పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య
కరోనా రోగులకు కోవిడ్​ కేంద్రం, క్వారంటైన్​ సదుపాయాలు ఏర్పాటు

గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపాలిటీలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రాన్ని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ప్రారంభించారు. వైద్యశాలలో 30 పడకలు ఉండగా.. 15 పడకలను కరోనా రోగుల చికిత్సకు వినియోగించనున్నారు. ప్రతి బెడ్ కు ఆక్సిజన్​, ఇతర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నిడుబ్రోలులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 96 పడగల క్వారంటైన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కోవిడ్​ కేంద్రం ఏర్పాటు చేయాలన్న తన అభ్యర్థన మేరకు... అధికారులను సీఎం ఆదేశించడంపై హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపాలిటీలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రాన్ని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ప్రారంభించారు. వైద్యశాలలో 30 పడకలు ఉండగా.. 15 పడకలను కరోనా రోగుల చికిత్సకు వినియోగించనున్నారు. ప్రతి బెడ్ కు ఆక్సిజన్​, ఇతర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నిడుబ్రోలులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 96 పడగల క్వారంటైన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కోవిడ్​ కేంద్రం ఏర్పాటు చేయాలన్న తన అభ్యర్థన మేరకు... అధికారులను సీఎం ఆదేశించడంపై హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

'ఓట్ల లెక్కింపు వాయిదా వేస్తే ఆకాశం విరిగిపడుతుందా?'

విడాకులు ఇవ్వలేదన్న కోపంతో... భార్యపై కత్తితో దాడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.