ETV Bharat / state

సీఎం నివాస ప్రాంతంలో రోజుకు 2 సార్లు శానిటైజేషన్ - తాడేపల్లిలో కరోనా కేసులు

తాడేపల్లిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సీఎం జగన్ నివాసం ఉంటున్న ప్రాంతంలో... అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రాంతంలో రహదారులను మూసివేయనున్నారు. ముఖ్యమంత్రి నివాసముండే ప్రాంతాన్ని రోజుకు 2 సార్లు శానిటైజ్ చేయనున్నారు.

corona cases in thadepalli guntur
corona cases in thadepalli guntur
author img

By

Published : May 14, 2020, 1:58 PM IST

ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉండే తాడేపల్లిలో కరోనా పాజిటివ్ కేసులు పెరగుతున్న కారణంగా.. అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మంగళగిరి నుంచి తాడేపల్లి వచ్చే రహదారులను మూసివేయనున్నారు. తాడేపల్లిలో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లి పురపాలక సంఘం, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం వహించొద్దని అధికారులకు స్పష్టం చేశారు. తాడేపల్లికి వచ్చే అన్ని రహదారులను తక్షణమే మూసివేసి.. నివారణ చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. రెడ్ జోన్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.

ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉండే తాడేపల్లిలో కరోనా పాజిటివ్ కేసులు పెరగుతున్న కారణంగా.. అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మంగళగిరి నుంచి తాడేపల్లి వచ్చే రహదారులను మూసివేయనున్నారు. తాడేపల్లిలో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లి పురపాలక సంఘం, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం వహించొద్దని అధికారులకు స్పష్టం చేశారు. తాడేపల్లికి వచ్చే అన్ని రహదారులను తక్షణమే మూసివేసి.. నివారణ చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. రెడ్ జోన్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 36 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.