ETV Bharat / state

గుంటూరు జిల్లాలో కొత్తగా 15 కేసులు.. మొత్తం 617

గుంటూరు జిల్లాలో కొత్తగా నమోదైన 15 కేసులతో కలిపి... మొత్తం కరోనా కేసుల సంఖ్య 617కు చేరింది. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న తాడేపల్లి, దుగ్గిరాల ప్రాంతాలను పూర్తిగా లాక్ డౌన్ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.

author img

By

Published : Jun 12, 2020, 5:21 PM IST

corona cases in guntur district
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో కొత్తగా 15 కరోనా కేసులు నమోదయ్యాయి. దుగ్గిరాల 6, గుంటూరు 4, తాడేపల్లి 2, విప్పర్ల 1, ఫిరంగిపురం 1, నంబూరులో ఒక కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 617కు చేరింది. మొన్నటివరకూ పట్టణాల్లోనే వెలుగుచూసిన కొవిడ్ కేసులు.. ఇప్పుడు పల్లెలకూ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది.

కేసులు ఎక్కువగా ఉన్న తాడేపల్లి, దుగ్గిరాలను పూర్తిగా లాక్ డౌన్ చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేశారు. పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్ట్స్ సేకరిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో కొత్తగా 15 కరోనా కేసులు నమోదయ్యాయి. దుగ్గిరాల 6, గుంటూరు 4, తాడేపల్లి 2, విప్పర్ల 1, ఫిరంగిపురం 1, నంబూరులో ఒక కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 617కు చేరింది. మొన్నటివరకూ పట్టణాల్లోనే వెలుగుచూసిన కొవిడ్ కేసులు.. ఇప్పుడు పల్లెలకూ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది.

కేసులు ఎక్కువగా ఉన్న తాడేపల్లి, దుగ్గిరాలను పూర్తిగా లాక్ డౌన్ చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేశారు. పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్ట్స్ సేకరిస్తున్నారు.

ఇవీ చదవండి...

కార్పొరేషన్​గా మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.