ETV Bharat / state

ARREST: రాజధాని నిర్మాణ సామాగ్రి దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్​ - construction materials stealing gang arrested

రాజధాని అమరావతిలో నిర్మాణం కోసం ఉంచిన విలువైన సామగ్రి దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ. 2 లక్షల విలువైన ఐరన్​ మెటీరియల్​ తరలిస్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాజధాని నిర్మాణ సామాగ్రి దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్​
రాజధాని నిర్మాణ సామాగ్రి దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్​
author img

By

Published : Aug 22, 2021, 4:25 PM IST

రాజధాని అమరావతిలో నిర్మాణ సామగ్రిని చోరీ చేస్తున్న ముఠాను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. లింగాయపాలెంలోని ఎన్సీసీ(NCC) నిర్మాణ సంస్థకు చెందిన క్యాంపులో నిర్మాణం కోసం ఉంచిన సుమారు రూ. 2 లక్షలు విలువైన సామగ్రిని చోరీచేసి పారిపోతుండగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. రాయపూడికి చెందిన ముగ్గురు సభ్యులను అరెస్టు చేశారు.

కొంత కాలంగా రాజధానిలో నిర్మాణ పనులకోసం ఉంచిన కంకర, ఇసుక, ఇతర సామగ్రిని అక్రమంగా తరలిస్తున్నారంటూ రైతులు, ఎస్సీ సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యంలో పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ పెంచారు. శనివారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో రాయపూడికి చెందిన సయ్యద్ మాబు, అలీషహీద్, కొయ్యగూర వంశీలు ఇనుప గడ్డర్లను తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు తుళ్లూరు సీఐ దుర్గాప్రసాద్​ తెలిపారు.

రాజధాని అమరావతిలో నిర్మాణ సామగ్రిని చోరీ చేస్తున్న ముఠాను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. లింగాయపాలెంలోని ఎన్సీసీ(NCC) నిర్మాణ సంస్థకు చెందిన క్యాంపులో నిర్మాణం కోసం ఉంచిన సుమారు రూ. 2 లక్షలు విలువైన సామగ్రిని చోరీచేసి పారిపోతుండగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. రాయపూడికి చెందిన ముగ్గురు సభ్యులను అరెస్టు చేశారు.

కొంత కాలంగా రాజధానిలో నిర్మాణ పనులకోసం ఉంచిన కంకర, ఇసుక, ఇతర సామగ్రిని అక్రమంగా తరలిస్తున్నారంటూ రైతులు, ఎస్సీ సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యంలో పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ పెంచారు. శనివారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో రాయపూడికి చెందిన సయ్యద్ మాబు, అలీషహీద్, కొయ్యగూర వంశీలు ఇనుప గడ్డర్లను తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు తుళ్లూరు సీఐ దుర్గాప్రసాద్​ తెలిపారు.

ఇదీ చదవండి:

'సున్నిత కేసుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.