ETV Bharat / state

ఫలితాలు ఎలా ఉన్నా.. పిల్లలను ప్రోత్సహించండి: సీఎం

మంగళవారం విడుదల కానున్న పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నా పిల్లలకు అండగా ఉండాలని తల్లిదండ్రులను కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

author img

By

Published : May 13, 2019, 5:03 PM IST

cm

రాష్ట్ర పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి సందేశాత్మక ట్వీట్ చేశారు. ఫలితాలు విడుదల అయ్యాక... మార్కులను బట్టి వారిని నిందించడం, ఇతర పిల్లలతో పోల్చడం వంటివి చేయవద్దని తల్లిదండ్రులను కోరారు. పిల్లల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయరాదని సూచించారు. ధైర్యం చెప్పాలని, ఈ ఫలితాలు తెలివితేటలకు కొలమానాలు కాదని ట్వీట్ చేశారు. కిందపడినా రివ్వున పైకి లేచే కెరటాల్లా రెట్టించిన ఉత్సాహంతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని వారిలో ప్రేరణ కలిగించాలన్నారు. పాఠశాల విద్యాశాఖ... మంగళవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనుందన్న ముఖ్యమంత్రి.... ఆర్టీజీఎస్‌ వెబ్‌సైట్‌, పీపుల్‌ ఫస్ట్‌ మొబైల్‌ యాప్‌, ఖైజాలా యాప్‌, ఫైబ‌ర్ నెట్ టీవీ తెర‌పైనా ఫలితాలు తెలుసుకోవ‌చ్చని తెలిపారు.

  • విద్యార్థుల తల్లిడండ్రులకు నా వినతి.. రేపు విడుదల కానున్న ఆంధ్రప్రదేశ్ పదోతరగతి ప‌రీక్షా ఫలితాల్లో మీ పిల్లల ఫలితాలు ఎలా ఉన్నా మీ అండ వారికి ఎంతో అవసరం. వారిని నిందించడం, ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడటం చేయకండి, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకండి.

    — N Chandrababu Naidu (@ncbn) May 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • పిల్లలకు ధైర్యం చెప్పండి, ఈ ఫలితాలు తెలివి తేటలకు కొలమానాలు కాదని, కింద పడినా రివ్వున పైకి లేచే కెరటాల్లా రెట్టించిన ఉత్సాహంతో అద్భుత ఫలితాలను సాధించవచ్చని వారిలో ప్రేరణ కల్గించండి.

    — N Chandrababu Naidu (@ncbn) May 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • పదో తరగతి ఫలితాలను 14.05.2019 ఉద‌యం 11 గంట‌ల‌కు పాఠ‌శాల విద్యాశాఖ‌ విడుదల చేయనుంది. ఫ‌లితాల‌ను విద్యార్థులు
    ఆర్టీజీఎస్ వెబ్‌సైట్‌https://t.co/AHFXBU8074
    పీపుల్‌ ఫ‌స్ట్ మొబైల్ యాప్‌ https://t.co/g9JRp13qJI
    ఖైజాలా యాప్‌https://t.co/HkPEhdGQBJ ద్వారా తెలుసుకోవచ్చు.

    — N Chandrababu Naidu (@ncbn) May 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • టీవీ తెర‌పైనా పదో తరగతి ఫలితాలను చూడవచ్చు. ఫైబ‌ర్ నెట్ క‌నెక్ష‌న్ ఉన్న ఇళ్ల‌లో టీవీ తెర‌పై విద్యార్థి నెంబ‌రు టైపు చేయ‌గానే ఫ‌లితాలు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

    — N Chandrababu Naidu (@ncbn) May 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్ర పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి సందేశాత్మక ట్వీట్ చేశారు. ఫలితాలు విడుదల అయ్యాక... మార్కులను బట్టి వారిని నిందించడం, ఇతర పిల్లలతో పోల్చడం వంటివి చేయవద్దని తల్లిదండ్రులను కోరారు. పిల్లల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయరాదని సూచించారు. ధైర్యం చెప్పాలని, ఈ ఫలితాలు తెలివితేటలకు కొలమానాలు కాదని ట్వీట్ చేశారు. కిందపడినా రివ్వున పైకి లేచే కెరటాల్లా రెట్టించిన ఉత్సాహంతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని వారిలో ప్రేరణ కలిగించాలన్నారు. పాఠశాల విద్యాశాఖ... మంగళవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనుందన్న ముఖ్యమంత్రి.... ఆర్టీజీఎస్‌ వెబ్‌సైట్‌, పీపుల్‌ ఫస్ట్‌ మొబైల్‌ యాప్‌, ఖైజాలా యాప్‌, ఫైబ‌ర్ నెట్ టీవీ తెర‌పైనా ఫలితాలు తెలుసుకోవ‌చ్చని తెలిపారు.

  • విద్యార్థుల తల్లిడండ్రులకు నా వినతి.. రేపు విడుదల కానున్న ఆంధ్రప్రదేశ్ పదోతరగతి ప‌రీక్షా ఫలితాల్లో మీ పిల్లల ఫలితాలు ఎలా ఉన్నా మీ అండ వారికి ఎంతో అవసరం. వారిని నిందించడం, ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడటం చేయకండి, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకండి.

    — N Chandrababu Naidu (@ncbn) May 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • పిల్లలకు ధైర్యం చెప్పండి, ఈ ఫలితాలు తెలివి తేటలకు కొలమానాలు కాదని, కింద పడినా రివ్వున పైకి లేచే కెరటాల్లా రెట్టించిన ఉత్సాహంతో అద్భుత ఫలితాలను సాధించవచ్చని వారిలో ప్రేరణ కల్గించండి.

    — N Chandrababu Naidu (@ncbn) May 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • పదో తరగతి ఫలితాలను 14.05.2019 ఉద‌యం 11 గంట‌ల‌కు పాఠ‌శాల విద్యాశాఖ‌ విడుదల చేయనుంది. ఫ‌లితాల‌ను విద్యార్థులు
    ఆర్టీజీఎస్ వెబ్‌సైట్‌https://t.co/AHFXBU8074
    పీపుల్‌ ఫ‌స్ట్ మొబైల్ యాప్‌ https://t.co/g9JRp13qJI
    ఖైజాలా యాప్‌https://t.co/HkPEhdGQBJ ద్వారా తెలుసుకోవచ్చు.

    — N Chandrababu Naidu (@ncbn) May 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • టీవీ తెర‌పైనా పదో తరగతి ఫలితాలను చూడవచ్చు. ఫైబ‌ర్ నెట్ క‌నెక్ష‌న్ ఉన్న ఇళ్ల‌లో టీవీ తెర‌పై విద్యార్థి నెంబ‌రు టైపు చేయ‌గానే ఫ‌లితాలు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

    — N Chandrababu Naidu (@ncbn) May 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Intro:AP_GNT_26_23_YCP_TEAM_VISIT_LANKAS_AVB_C10

Centre. Mangalagiri

Ramkumar. 8008001908


Body:script


Conclusion:FTP lo vachindi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.