ETV Bharat / state

గుంటూరు జీజీహెచ్​లో నూతన పథకం ప్రారంభించనున్న సీఎం

author img

By

Published : Dec 1, 2019, 10:29 PM IST

ముఖ్యమంత్రి జగన్ గుంటూరు పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మరో నూతన పథకాన్ని సీఎం జగన్​ ప్రారంభించనున్నారు.

గుంటూరు ఆసుపత్రిలో నూతన పథకం ప్రారంభించనున్న సీఎం
గుంటూరు ఆసుపత్రిలో నూతన పథకం ప్రారంభించనున్న సీఎం

వైఎస్సార్​ ఆరోగ్య శ్రీ పథకం కింద శస్త్రచికిత్స అనంతరం... రోగులకు విశ్రాంతి సమయంలో అందించే ఆర్థిక సాయం పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. గుంటూరు పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి... ముందుగా పోలీస్ పెరేడ్ మైదానానికి చేరుకుంటారు. అక్కడినుంచి ఉదయం 11 గంటల 20 నిమిషాలకు జీజీహెచ్​ చేరుకుంటారు. నూతన పథకంలో భాగంగా రోగులకు నగదు సాయం అందజేస్తారు. రోజుకు రూ.225 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. అనంతరం 11 గంటల 40 నిమిషాలకు వైద్య కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో నిర్వహించే సమావేశంలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా మంత్రి మోపిదేవి వెంకటరమణ, కలెక్టర్ శామ్యూల్​ ఆనంద్​కుమార్, ఎమ్మెల్యేలు పరిశీలించారు.

వైఎస్సార్​ ఆరోగ్య శ్రీ పథకం కింద శస్త్రచికిత్స అనంతరం... రోగులకు విశ్రాంతి సమయంలో అందించే ఆర్థిక సాయం పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. గుంటూరు పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి... ముందుగా పోలీస్ పెరేడ్ మైదానానికి చేరుకుంటారు. అక్కడినుంచి ఉదయం 11 గంటల 20 నిమిషాలకు జీజీహెచ్​ చేరుకుంటారు. నూతన పథకంలో భాగంగా రోగులకు నగదు సాయం అందజేస్తారు. రోజుకు రూ.225 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. అనంతరం 11 గంటల 40 నిమిషాలకు వైద్య కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో నిర్వహించే సమావేశంలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా మంత్రి మోపిదేవి వెంకటరమణ, కలెక్టర్ శామ్యూల్​ ఆనంద్​కుమార్, ఎమ్మెల్యేలు పరిశీలించారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.