ETV Bharat / state

రాజకీయ లబ్ధికోసం వైకాపా కులచిచ్చు రగిలిస్తోంది: చంద్రబాబు

కుల, మత ఘర్షణలు సృష్టించడం వైకాపా ప్రవృత్తని... తెదేపా అధినేత చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. బలహీనవర్గాల కోసం  తెదేపా నిరంతరం పాటుపడుతుందని స్పష్టం చేశారు.

author img

By

Published : Sep 5, 2019, 8:03 PM IST

రాజకీయ లబ్ధికోసం వైకాపా  కులచిచ్చు రగిలిస్తోంది : చంద్రబాబు
రాజకీయ లబ్ధికోసం వైకాపా కులచిచ్చు రగిలిస్తోంది : చంద్రబాబు

మత ఘర్షణలు సృష్టించడం, కులాల మధ్య చిచ్చుపెట్టడం వైకాపాకు పుట్టుకతో వచ్చిన సిద్ధాంతమని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. బలహీన వర్గాల కోసం, సామాజిక న్యాయం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశమన్న ఆయన.. వైకాపా మాదిరిగా కుల రాజకీయాలు చేయడం తమ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విషయంలో వైకాపా కావాలనే కులచిచ్చు రగిలిస్తోందని ధ్వజమెత్తారు. తాను క్రిస్టియన్, భర్త కాపు కులస్తుడని ఆమె ఇంటర్వ్యూలో చెప్తే.. వైకాపా దళిత మహిళగా రాజకీయం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎస్సీలకు కేటాయించిన అసెంబ్లీ సీటు శ్రీదేవికి కట్టబెట్టి అన్యాయం చేసింది వైకాపా కాదా అని ఎస్సీలే నిలదీస్తున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు.

రాజకీయ లబ్ధికోసం వైకాపా కులచిచ్చు రగిలిస్తోంది : చంద్రబాబు

మత ఘర్షణలు సృష్టించడం, కులాల మధ్య చిచ్చుపెట్టడం వైకాపాకు పుట్టుకతో వచ్చిన సిద్ధాంతమని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. బలహీన వర్గాల కోసం, సామాజిక న్యాయం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశమన్న ఆయన.. వైకాపా మాదిరిగా కుల రాజకీయాలు చేయడం తమ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విషయంలో వైకాపా కావాలనే కులచిచ్చు రగిలిస్తోందని ధ్వజమెత్తారు. తాను క్రిస్టియన్, భర్త కాపు కులస్తుడని ఆమె ఇంటర్వ్యూలో చెప్తే.. వైకాపా దళిత మహిళగా రాజకీయం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎస్సీలకు కేటాయించిన అసెంబ్లీ సీటు శ్రీదేవికి కట్టబెట్టి అన్యాయం చేసింది వైకాపా కాదా అని ఎస్సీలే నిలదీస్తున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:

ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించిన వ్యక్తుల అరెస్టు

Intro:333Body:777Conclusion:ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడం పట్ల కడప జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సంబరాలు జరుపుకున్నారు .బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు.

కడప జిల్లా బద్వేలులో ఎంప్లాయిస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు .ఈరోజు బద్వేల్ గ్యారేజ్ ఎదుట వారు సమావేశమయ్యారు. గతంలో ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతున్న ప్రభుత్వం స్పందించలేదని ,అన్నారు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మూడు నెలలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు .ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.