ముఖ్యమంత్రి జగన్ బీసీలకు సముచిత స్థానం కల్పించి అండగా నిలుస్తున్నారని బీసీ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీ కులాల అన్నింటికీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. ప్రతి కార్పొరేషన్ కు ఛైర్మన్ తో పాటు 12 మంది డైరెక్టర్లను నియమించటం అభినందనీయమన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన బీసీ కార్పొరేషన్ చైర్మన్ల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీసీలకు సంబంధించి కులవృత్తులకు రాయితీలు అందిస్తూ వారిని అభివృద్ధిలో నిలిపేందుకు జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు.
ఇదీ చదవండి: పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే: సీఎం జగన్