ETV Bharat / state

Ashok Babu to High Court: హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేసిన అశోక్‌బాబు.. మధ్యాహ్నం విచారణ

author img

By

Published : Feb 11, 2022, 11:31 AM IST

Updated : Feb 11, 2022, 12:36 PM IST

ashok babu lunchmotion petition
ashok babu lunchmotion petition

11:29 February 11

బెయిల్‌ మంజూరు చేయాలని అశోక్‌బాబు పిటిషన్‌

MLC Ashok Babu Bail petition: బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్​బాబు హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని.. బెయిల్‌ ఇవ్వాలని అశోక్​బాబు తరపున న్యాయవాదులు పిటిషన్​లో కోరారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపట్టనుంది.

తప్పుడు విద్యార్హత ధ్రువపత్రాలతో ప్రమోషన్​ పొందారనే ఆరోపణలపై సీఐడీ అధికారులు అశోక్‌బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసి.. గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

అశోక్ బాబు న్యాయవాదులను అడ్డుకున్న పోలీసులు..

ఎమ్మెల్సీ అశోక్ బాబు తరఫు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు. వారిని కార్యాలయం వద్దకు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సీఐడీ అధికారులు చెబితేనే కార్యాలయానికి పంపిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం..

అశోక్​బాబు అరెస్ట్​ సమాచారం తెలుసుకుని పలువురు తెదేపా నేతలు గుంటూరులోని సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు. సీఐడీ కార్యాలయం వద్దకు వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అశోక్​బాబును కలుసుకునేందుకు దేవినేని ఉమతో పాటు పలువురు తెదేపా నేతలు రాగా.. పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఉమతో పాటు.. తెదేపా నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చిరాం ప్రసాద్, పిల్లి మాణిక్యరావు, సుఖవాసి, కనపర్తిలను అరెస్ట్​ చేశారు. అశోక్​బాబుపై సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తెదేపా నేతలు అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఎంపీ రఘురామకృష్ణరాజుని కూడా కొట్టారన్న నేతలు.. అందుకే అశోక్​బాబును చూపించాలని డిమాండ్​ చేస్తున్నామన్నారు.

సంబంధిత కథనాలు:

11:29 February 11

బెయిల్‌ మంజూరు చేయాలని అశోక్‌బాబు పిటిషన్‌

MLC Ashok Babu Bail petition: బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్​బాబు హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని.. బెయిల్‌ ఇవ్వాలని అశోక్​బాబు తరపున న్యాయవాదులు పిటిషన్​లో కోరారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపట్టనుంది.

తప్పుడు విద్యార్హత ధ్రువపత్రాలతో ప్రమోషన్​ పొందారనే ఆరోపణలపై సీఐడీ అధికారులు అశోక్‌బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసి.. గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

అశోక్ బాబు న్యాయవాదులను అడ్డుకున్న పోలీసులు..

ఎమ్మెల్సీ అశోక్ బాబు తరఫు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు. వారిని కార్యాలయం వద్దకు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సీఐడీ అధికారులు చెబితేనే కార్యాలయానికి పంపిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం..

అశోక్​బాబు అరెస్ట్​ సమాచారం తెలుసుకుని పలువురు తెదేపా నేతలు గుంటూరులోని సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు. సీఐడీ కార్యాలయం వద్దకు వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అశోక్​బాబును కలుసుకునేందుకు దేవినేని ఉమతో పాటు పలువురు తెదేపా నేతలు రాగా.. పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఉమతో పాటు.. తెదేపా నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చిరాం ప్రసాద్, పిల్లి మాణిక్యరావు, సుఖవాసి, కనపర్తిలను అరెస్ట్​ చేశారు. అశోక్​బాబుపై సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తెదేపా నేతలు అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఎంపీ రఘురామకృష్ణరాజుని కూడా కొట్టారన్న నేతలు.. అందుకే అశోక్​బాబును చూపించాలని డిమాండ్​ చేస్తున్నామన్నారు.

సంబంధిత కథనాలు:

Last Updated : Feb 11, 2022, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.