ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Dec 31, 2022, 4:59 PM IST

..

AP TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

  • ముఖ ఆధారిత హాజరు నమోదు కోసం.. గూగుల్ ప్లే స్టోర్​లో యాప్​
    face recognition App on Google Play Store: గూగుల్ ప్లే స్టోర్​లో ముఖ ఆధారిత హాజరు నమోదు కోసం ప్రభుత్వం కొత్త యాప్​ను తీసుకువచ్చింది. ఈ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలంటూ ప్రభుత్వం ఉద్యోగులకు ఆదేశాలు జారి చేసింది. 2023 జనవరి 1 తేదీ నుంచి యాప్ ద్వారా మాత్రమే హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పెన్నా తీరంలో వైసీపీ నేతల దందా.. అక్రమంగా పంటలు సాగు.. ఆపై కోట్లలో లీజుకు
    Illegally Cultivated Crops in Penna River Basin: నెల్లూరు జిల్లాలో పెన్నా నది తీరంలో యథేచ్ఛగా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. నదీతీర ప్రాంతంలో బోర్లు తవ్వకూడదని వాల్టా చట్టం స్పష్టంగా చెబుతున్నా.. అక్రమంగా బోర్లు వేసి మరీ సాగు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. నదీ తీరాన్ని ఆక్రమించి సాగు చేయడమే కాకుండా లీజులకు కూడా ఇస్తున్నట్లు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విద్యార్థుల చదువులపై విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి అసంతృప్తి.. ఎందుకంటే..
    Education Principal Secretary Inspections : ప్రకాశం జిల్లాలోని గురుకుల పాఠశాలలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆయన అడిగిన ప్రశ్నలకు.. విద్యార్థులు ఇచ్చిన సమాధానాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఎమైందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మందుబాబులకు శుభవార్త.. అర్ధరాత్రి వరకూ మద్యం అమ్మకాలు
    Liquor Sales Time Extension: మందుబాబులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం దుకాణాలు, బార్ల విక్రయ సమయాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. 31వ తేదీతో పాటు 1వ తేదీన మొత్తంగా రెండు రోజులు పాటు.. ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ నిర్వహించే మద్యం దుకాణాలకు 12 గంటల వరకూ.. హోటళ్లు, ఈవెంట్లు, బార్లకు రాత్రి 1 గంట వరకూ అనుమతిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఓవర్ డోస్ ఇంజెక్షన్ చేసుకుని డాక్టర్ సూసైడ్​.. పెళ్లి కావట్లేదని యువకుడు ఆత్మహత్య..
    ఓ వైద్యుడు తనకు తానే అధిక మోతాదు ఇంజెక్షన్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. మరోవైపు.. 30 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదని మనస్తాపానికి గురయ్యాడు ఓ యువకుడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థతి తీవ్రంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘోరం కర్ణాటకలో వెలుగుచూసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. ఎదురు పడ్డ రెండు రైళ్లు.. చివరి నిమిషంలో..
    ఒకే ప్లాట్​ఫాంపై రెండు రైళ్లు ఎదురుపడ్డాయి. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విశ్రాంత పోప్ బెనెడిక్ట్ కన్నుమూత..
    విశ్రాంత పోప్ బెనెడిక్ట్ కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వాటికన్ ప్రతినిధులు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కొత్త ఏడాదికి 'ఆర్థిక' స్వాగతం.. భవిష్యత్తులో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
    నూతన సంవత్సర ఉషోదయం సమీపిస్తోంది. మంచి, చెడు జ్ఞాపకాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ.. కొత్తదనానికి స్వాగతం పలికేందుకు మనందరమూ సిద్ధం అవుతున్నాం. ఇప్పటి వరకూ ఏం చేశాం? మున్ముందు ఏం చేయాలి? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఎటు చూసినా.. సమాధానం మాత్రం డబ్బు అనే వస్తుంది. ఇప్పటికే మన దగ్గర ఉన్న సొమ్మును సరిగ్గా నిర్వహించాలి. భవిష్యత్‌ అవసరాలనూ దృష్టిలో పెట్టుకోవాలి. 2023లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒకసారి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రిషభ్​ పంత్​ హెల్త్​ అప్డేట్​.. ముఖానికి ప్లాస్టిక్​ సర్జరీ..
    Rishabh Pant Accident : శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీమ్​ఇండియా ప్లేయర్​ రిషభ్​​​​ పంత్​ తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నపంత్‌ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐతో పాటు దిల్లీ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్​(డీడీసీఏ) నిశితంగా పరిశీలిస్తోంది. అయితే శనివారం పంత్​ ఆరోగ్యంపై మరో హెల్త్​ అప్డేట్​ వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పవన్​ కల్యాణ్ 'ఖుషి' మేనియా.. థియేటర్‌లో అకీరా సందడి..
    Khusi Rerelease : టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల సందడి కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోల చిత్రాలు విడుదల కాగా, తాజాగా పవర్‌స్టార్ నటించిన 'ఖుషి' మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ముఖ ఆధారిత హాజరు నమోదు కోసం.. గూగుల్ ప్లే స్టోర్​లో యాప్​
    face recognition App on Google Play Store: గూగుల్ ప్లే స్టోర్​లో ముఖ ఆధారిత హాజరు నమోదు కోసం ప్రభుత్వం కొత్త యాప్​ను తీసుకువచ్చింది. ఈ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలంటూ ప్రభుత్వం ఉద్యోగులకు ఆదేశాలు జారి చేసింది. 2023 జనవరి 1 తేదీ నుంచి యాప్ ద్వారా మాత్రమే హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పెన్నా తీరంలో వైసీపీ నేతల దందా.. అక్రమంగా పంటలు సాగు.. ఆపై కోట్లలో లీజుకు
    Illegally Cultivated Crops in Penna River Basin: నెల్లూరు జిల్లాలో పెన్నా నది తీరంలో యథేచ్ఛగా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. నదీతీర ప్రాంతంలో బోర్లు తవ్వకూడదని వాల్టా చట్టం స్పష్టంగా చెబుతున్నా.. అక్రమంగా బోర్లు వేసి మరీ సాగు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. నదీ తీరాన్ని ఆక్రమించి సాగు చేయడమే కాకుండా లీజులకు కూడా ఇస్తున్నట్లు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విద్యార్థుల చదువులపై విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి అసంతృప్తి.. ఎందుకంటే..
    Education Principal Secretary Inspections : ప్రకాశం జిల్లాలోని గురుకుల పాఠశాలలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆయన అడిగిన ప్రశ్నలకు.. విద్యార్థులు ఇచ్చిన సమాధానాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఎమైందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మందుబాబులకు శుభవార్త.. అర్ధరాత్రి వరకూ మద్యం అమ్మకాలు
    Liquor Sales Time Extension: మందుబాబులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం దుకాణాలు, బార్ల విక్రయ సమయాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. 31వ తేదీతో పాటు 1వ తేదీన మొత్తంగా రెండు రోజులు పాటు.. ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ నిర్వహించే మద్యం దుకాణాలకు 12 గంటల వరకూ.. హోటళ్లు, ఈవెంట్లు, బార్లకు రాత్రి 1 గంట వరకూ అనుమతిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఓవర్ డోస్ ఇంజెక్షన్ చేసుకుని డాక్టర్ సూసైడ్​.. పెళ్లి కావట్లేదని యువకుడు ఆత్మహత్య..
    ఓ వైద్యుడు తనకు తానే అధిక మోతాదు ఇంజెక్షన్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. మరోవైపు.. 30 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదని మనస్తాపానికి గురయ్యాడు ఓ యువకుడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థతి తీవ్రంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘోరం కర్ణాటకలో వెలుగుచూసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. ఎదురు పడ్డ రెండు రైళ్లు.. చివరి నిమిషంలో..
    ఒకే ప్లాట్​ఫాంపై రెండు రైళ్లు ఎదురుపడ్డాయి. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విశ్రాంత పోప్ బెనెడిక్ట్ కన్నుమూత..
    విశ్రాంత పోప్ బెనెడిక్ట్ కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వాటికన్ ప్రతినిధులు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కొత్త ఏడాదికి 'ఆర్థిక' స్వాగతం.. భవిష్యత్తులో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
    నూతన సంవత్సర ఉషోదయం సమీపిస్తోంది. మంచి, చెడు జ్ఞాపకాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ.. కొత్తదనానికి స్వాగతం పలికేందుకు మనందరమూ సిద్ధం అవుతున్నాం. ఇప్పటి వరకూ ఏం చేశాం? మున్ముందు ఏం చేయాలి? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఎటు చూసినా.. సమాధానం మాత్రం డబ్బు అనే వస్తుంది. ఇప్పటికే మన దగ్గర ఉన్న సొమ్మును సరిగ్గా నిర్వహించాలి. భవిష్యత్‌ అవసరాలనూ దృష్టిలో పెట్టుకోవాలి. 2023లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒకసారి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రిషభ్​ పంత్​ హెల్త్​ అప్డేట్​.. ముఖానికి ప్లాస్టిక్​ సర్జరీ..
    Rishabh Pant Accident : శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీమ్​ఇండియా ప్లేయర్​ రిషభ్​​​​ పంత్​ తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నపంత్‌ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐతో పాటు దిల్లీ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్​(డీడీసీఏ) నిశితంగా పరిశీలిస్తోంది. అయితే శనివారం పంత్​ ఆరోగ్యంపై మరో హెల్త్​ అప్డేట్​ వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పవన్​ కల్యాణ్ 'ఖుషి' మేనియా.. థియేటర్‌లో అకీరా సందడి..
    Khusi Rerelease : టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల సందడి కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోల చిత్రాలు విడుదల కాగా, తాజాగా పవర్‌స్టార్ నటించిన 'ఖుషి' మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.