ETV Bharat / state

ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు లేరనే మాట ఎక్కడా వినిపించకూడదు: సీఎం జగన్

CM Review Health Department: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. గిరిజన ప్రాంతాలు సహా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ ఫిబ్రవరిలోగా భర్తీ చేయాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఉంటూ సేవలందించే వైద్యులకు ప్రోత్సాహకాలు ఇస్తామన్న సీఎం.. ఎంతమేర ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటే ఆమోదిస్తానని స్పష్టం చేశారు.

author img

By

Published : Feb 4, 2022, 5:24 AM IST

CM Review on Covid
CM Review on Covid

CM Review Health Department: ఫిబ్రవరి చివరినాటికి గిరిజన ప్రాంతాలు సహా అన్నిఆసుపత్రుల్లోని ఖాళీలను భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం... నాడు-నేడు, వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, అర్బన్‌ క్లినిక్స్‌ నిర్మాణ ప్రగతిపై ఆరాతీశారు. వైద్య సేవల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించడంపై దృష్టిపెట్టాలని... ఇప్పుడు ఖాళీగా ఉన్న డాక్టర్‌ పోస్టులను భర్తీచేయాలని సీఎం ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లు అక్కడ ఉండి సేవలను అందించడానికి ఎలాంటి ప్రతిపాదన చేసినా ఆమోదిస్తానని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సేవలందించే డాక్టర్లకు ప్రోత్సాహకాలు ఎంత ఇవ్వాలన్నదానిపై అధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకుంటే... దాన్ని తప్పనిసరిగా ఆమోదిస్తానన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా ఉండాలన్న సీఎం... డాక్టర్లు లేరు, సిబ్బంది లేరనే మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పష్టంగా మార్పులు కనిపించాలన్నారు.


కొవిడ్‌ నియంత్రణపై సమీక్ష...

రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ చర్యలు... వ్యాక్సినేషన్‌ ప్రక్రియపైనా సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. కొవిడ్‌ తీవ్రత క్రమంగా తగ్గుతోందని తెలిపారు. అన్నిరాష్ట్రాల్లోనూ ఆంక్షలను సడలిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు 1లక్ష 622 మంది ఉండగా వీరిలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు కేవలం 2301 మందేనని తెలిపారు. ఇందులో ఐసీయూలో ఉన్నవారు 263 మంది ఉండగా.. వీరు దాదాపుగా కోలుకుంటున్నారన్నారు. వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోందన్న అధికారులు.. రాష్ట్రంలో 15–18 ఏళ్ల మధ్య అందరికీ మొదటి డోసు పూర్తయ్యిందని వెల్లడించారు.

ఇదీ చదవండి: Sajjala Comments: సమ్మె వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తితే చూస్తూ ఊరుకోం: సజ్జల

CM Review Health Department: ఫిబ్రవరి చివరినాటికి గిరిజన ప్రాంతాలు సహా అన్నిఆసుపత్రుల్లోని ఖాళీలను భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం... నాడు-నేడు, వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, అర్బన్‌ క్లినిక్స్‌ నిర్మాణ ప్రగతిపై ఆరాతీశారు. వైద్య సేవల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించడంపై దృష్టిపెట్టాలని... ఇప్పుడు ఖాళీగా ఉన్న డాక్టర్‌ పోస్టులను భర్తీచేయాలని సీఎం ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లు అక్కడ ఉండి సేవలను అందించడానికి ఎలాంటి ప్రతిపాదన చేసినా ఆమోదిస్తానని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సేవలందించే డాక్టర్లకు ప్రోత్సాహకాలు ఎంత ఇవ్వాలన్నదానిపై అధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకుంటే... దాన్ని తప్పనిసరిగా ఆమోదిస్తానన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా ఉండాలన్న సీఎం... డాక్టర్లు లేరు, సిబ్బంది లేరనే మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పష్టంగా మార్పులు కనిపించాలన్నారు.


కొవిడ్‌ నియంత్రణపై సమీక్ష...

రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ చర్యలు... వ్యాక్సినేషన్‌ ప్రక్రియపైనా సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. కొవిడ్‌ తీవ్రత క్రమంగా తగ్గుతోందని తెలిపారు. అన్నిరాష్ట్రాల్లోనూ ఆంక్షలను సడలిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు 1లక్ష 622 మంది ఉండగా వీరిలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు కేవలం 2301 మందేనని తెలిపారు. ఇందులో ఐసీయూలో ఉన్నవారు 263 మంది ఉండగా.. వీరు దాదాపుగా కోలుకుంటున్నారన్నారు. వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోందన్న అధికారులు.. రాష్ట్రంలో 15–18 ఏళ్ల మధ్య అందరికీ మొదటి డోసు పూర్తయ్యిందని వెల్లడించారు.

ఇదీ చదవండి: Sajjala Comments: సమ్మె వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తితే చూస్తూ ఊరుకోం: సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.