ETV Bharat / state

పిడుగుపాటుకు ఎద్దు మృతి... ఇద్దరికి గాయాలు - గుంటూరు జిల్లా తాజా వార్తలు

ఓ రైతు మిర్చిపొలంలో నాగలితో దున్నుతున్నారు. ఉరుములతో కూడిన జల్లులు మొదలయ్యాయి. ఒక్కసారిగా పిడుగు... అరకకు కట్టిన ఎద్దుపై పడింది. అది అక్కడిక్కడే మృతిచెందింది. రైతుకు, పొలం యజమానికి గాయాలయ్యాయి. కళ్ల ముందే ఎద్దు మృత్యువాత పడటంతో రైతు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో జరిగింది.

animal died
పిడుగుపాటుకు ఎద్దు మృతి
author img

By

Published : Nov 5, 2020, 8:52 PM IST

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కారుచోల పరిధిలోని మిర్చిపొలంలో పిడుగు పడి ఒక ఎద్దు మృతి చెందింది. బాజీ తన పొలాన్ని దున్నాలని లోకేశ్ అనే రైతును కోరారు. ఎద్దులతో రైతు పొలాన్ని దున్నుతుండగా ఉరుములతో కూడిన వర్షపు జల్లులు ప్రారంభమయ్యాయి.

అంతలో హఠాత్తుగా పిడుగు పడింది. దాంతో ఒక ఎద్దు అక్కడిక్కడే మరణించింది. రైతు, పొలం యజమాని స్పృహా కోల్పోయారు. వెంటనే స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఎద్దు మృతిచెందటంతో రైతు లోకేష్ రోదన.. చూపరులను కంటతడి పెట్టించింది.

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కారుచోల పరిధిలోని మిర్చిపొలంలో పిడుగు పడి ఒక ఎద్దు మృతి చెందింది. బాజీ తన పొలాన్ని దున్నాలని లోకేశ్ అనే రైతును కోరారు. ఎద్దులతో రైతు పొలాన్ని దున్నుతుండగా ఉరుములతో కూడిన వర్షపు జల్లులు ప్రారంభమయ్యాయి.

అంతలో హఠాత్తుగా పిడుగు పడింది. దాంతో ఒక ఎద్దు అక్కడిక్కడే మరణించింది. రైతు, పొలం యజమాని స్పృహా కోల్పోయారు. వెంటనే స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఎద్దు మృతిచెందటంతో రైతు లోకేష్ రోదన.. చూపరులను కంటతడి పెట్టించింది.

ఇదీ చదవండి:

ఆ ఎమ్మెల్యే, ఎంపీ నుంచి మాకు ప్రాణ హాని: వైకాపా కార్యకర్తల ఆరోపణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.