ETV Bharat / state

న్యాయం గెలుస్తుంది-అమరావతి నిలుస్తుంది: అమరావతి రైతులు

author img

By

Published : Oct 16, 2020, 2:03 PM IST

అమరావతి కోసం రైతులు చేస్తున్న దీక్షలు 304వ రోజుకు చేరుకున్నారు. బోరుపాలెంలో వర్షాన్ని లెక్కచేయకుండా మహిళలు, చిన్నారులు నిరసనలో పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళా రైతులపై అసభ్యంగా పోస్టులు పెట్టడం విచారకరమని ఆవేదన వ్యక్తంచేశారు.

amaravathi farmers protest
అమరావతి ఆందోళనలు

'న్యాయం గెలుస్తుంది- అమరావతి నిలుస్తుంది' అనే నినాదాలతో 304వ రోజు అమరావతి దీక్షలు కొనసాగాయి. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బోరుపాలెం మహిళా రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. వర్షాన్ని లెక్క చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. మహిళలు, చిన్నారులు నిరసనలో పాల్గొన్నారు.

సామాజిక మాధ్యమాల్లో మహిళా రైతులపై అసభ్యకర పోస్టులు పెట్టేవారికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొమ్ముకాయడం సిగ్గుచేటన్నారు. తమపై అసభ్యకర పోస్టులు పెట్టేవారికి మద్దతు పలుకుతూ తిరిగి తమపైనే కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. 304 రోజులుగా సుదీర్ఘంగా పోరాడుతున్నా.. స్థానిక ఎమ్మెల్యేలు స్పందించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

'న్యాయం గెలుస్తుంది- అమరావతి నిలుస్తుంది' అనే నినాదాలతో 304వ రోజు అమరావతి దీక్షలు కొనసాగాయి. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బోరుపాలెం మహిళా రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. వర్షాన్ని లెక్క చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. మహిళలు, చిన్నారులు నిరసనలో పాల్గొన్నారు.

సామాజిక మాధ్యమాల్లో మహిళా రైతులపై అసభ్యకర పోస్టులు పెట్టేవారికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొమ్ముకాయడం సిగ్గుచేటన్నారు. తమపై అసభ్యకర పోస్టులు పెట్టేవారికి మద్దతు పలుకుతూ తిరిగి తమపైనే కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. 304 రోజులుగా సుదీర్ఘంగా పోరాడుతున్నా.. స్థానిక ఎమ్మెల్యేలు స్పందించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి..

దుర్గ గుడి పైవంతెన ప్రారంభం.... వర్చువల్​గా పాల్గొన్న జగన్​, గడ్కరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.