ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

author img

By

Published : May 4, 2021, 8:48 AM IST

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

a women died in road accident
ప్రమాదంలో మరణించిన మహిళ

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద నిన్న రాత్రి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన మేడిద దీనమ్మ అనే మహిళ అక్కడికక్కడే మరణించింది. భద్రాచలం డిపోకు చెందిన టీఎస్ఆర్​టీసీ బస్సు తిరుపతి వెళుతుండగా.. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. దీనిపై యడ్లపాడు ఎస్సై రాంబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్ దీపాలు లేకపోవటమే కారణం:

జాతీయ రహదారిపై ఉన్న పారిశ్రామికవాడలైన తిమ్మాపురం- గణపవరం మధ్య కిలోమీటర్ వరకు విద్యుత్ దీపాలు లేవు. రోడ్డుకు ఇరువైపులా పలుకాలనీలు, స్పిన్నింగ్​ మిల్లులు ఉండటంతో నిత్యం జనం, కార్మికులు అటూ.. ఇటూ తిరుగుతూ ఉంటారు. ఆ ప్రాంతం అంతా చీకటిగా ఉండడంతో వాహనాలు దగ్గరికి వచ్చే వరకూ రోడ్డు దాటే వారు కనిపించరు. ఇదే ప్రమాదాలకు కారణంగా ఉందని స్థానికులు అంటున్నారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: సబ్బం హరి పార్థివదేహానికి నేడు అంత్యక్రియలు

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద నిన్న రాత్రి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన మేడిద దీనమ్మ అనే మహిళ అక్కడికక్కడే మరణించింది. భద్రాచలం డిపోకు చెందిన టీఎస్ఆర్​టీసీ బస్సు తిరుపతి వెళుతుండగా.. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. దీనిపై యడ్లపాడు ఎస్సై రాంబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్ దీపాలు లేకపోవటమే కారణం:

జాతీయ రహదారిపై ఉన్న పారిశ్రామికవాడలైన తిమ్మాపురం- గణపవరం మధ్య కిలోమీటర్ వరకు విద్యుత్ దీపాలు లేవు. రోడ్డుకు ఇరువైపులా పలుకాలనీలు, స్పిన్నింగ్​ మిల్లులు ఉండటంతో నిత్యం జనం, కార్మికులు అటూ.. ఇటూ తిరుగుతూ ఉంటారు. ఆ ప్రాంతం అంతా చీకటిగా ఉండడంతో వాహనాలు దగ్గరికి వచ్చే వరకూ రోడ్డు దాటే వారు కనిపించరు. ఇదే ప్రమాదాలకు కారణంగా ఉందని స్థానికులు అంటున్నారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: సబ్బం హరి పార్థివదేహానికి నేడు అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.