ఏజెన్సీ ప్రాంతంలో మాత, శిశు మరణాలను నిర్ములించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని... శిశు, మహిళాభివృద్ది సంక్షేమ శాఖ జిల్లా ఇంచార్జ్ ఉప సంచాలకులు విజయలక్ష్మి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఐటీడీఏ పరిధిలోని ఏడు మండలాల్లో 2093 మంది గర్భిణులకు, 2884 మంది బాలింతలకు, ఆరు నెలల వయసు నుంచి మూడు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలలకు 600 రూపాయలు విలువ చేసే పోషకాహార కిట్లను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం సీడీపీఓ క్రాంతి కుమారి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: